Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
Bigg Boss Telugu 5: ఐదో కంటెస్టెంట్గా పైసా వసూల్ కొరియోగ్రాఫర్.. ఆ రికార్డు కొడతానంటూ!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. హిందీలో చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయిన ఈ షో.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే పరిచయం అయింది. అస్సలు పరిచయం లేని కంటెంట్తో వచ్చే ఈ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ను అందించారు. ఫలితంగా ఇది నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా ప్రారంభం అయిపోయింది. ఇక, ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఐదో కంటెస్టెంట్గా ఆనీ మాస్టర్ అడుగు పెట్టారు. ఆ వివరాలు మీకోసం!
ఐదింతలు ఎక్కువగా ఉంటుందని ప్రకటన
ఆదివారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఐదింతల ఎంటర్టైన్మెంట్, ఐదింతల డ్రామా, ఐదింతల ఎనర్జీ ఉండబోతుందని నిర్వహకులు వెల్లడించారు. అంతేకాదు, షో జరిగే తీరులో కూడా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ను కూడా మరింత సుందరంగా తీర్చిదిద్దారు.
ఐదో సీజన్ అదిరిలా... లోపలికి వెళ్లారుగా
బిగ్ బాస్ ప్రియులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఎన్నో అనుమానాల నడుమ ఐదో సీజన్ను ఆదివారం ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
కంటెస్టెంట్ల ఎంపికపై ఈ సారి చాలా కొత్తగా
బిగ్ బాస్ షో అంటే ఎంత సక్సెస్ఫుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి పెద్దపీట వేశారు. వీళ్లంతా చాలా రోజులుగా క్వారంటైన్లో ఉండి వచ్చారు.
ఐదో కంటెస్టెంట్గా ఆనీ మాస్టర్ వచ్చేశారు
బిగ్ బాస్ ప్రీమియర్ ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగుతోంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో కంటెస్టెంట్గా టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ ప్రవేశించారు. మొదట ఆమె ఏవీని వేసిన నిర్వహకులు ఆమెను పరిచయం చేశారు. అనంతరం ఆమె తెలుసా తెలుసా అనే పాటకు డ్యాన్స్ చేసి సందడి చేశారు.
ఆ రికార్డును క్రియేట్ చేస్తానని డైలాగ్ చెప్పి
ఏవీ ప్రసారం అయిన సమయంలో ఆనీ మాస్టర్ తనకు అసిస్టెంట్గా అవకాశం ఇచ్చిన కొరియోగ్రాఫర్ల పేర్లు చెప్పి వాళ్లకు థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత తానకు నందమూరి బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' సినిమాతో గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇక, బిగ్ బాస్లో ఇప్పటి వరకూ లేడీ కంటెస్టెంట్ గెలవలేదని.. ఇప్పుడు తాను గెలిచేందుకు ప్రయత్నం చేస్తానని ఆనీ మాస్టర్ వెల్లడించారు.
Recommended Video
కష్టాలు చెప్పి.. నాగ్కు షాక్.. సర్ప్రైజ్తో
ఆనీ మాస్టర్ బిగ్ బాస్ స్టేజ్పై తన కష్టాలను వివరించారు. అదే సమయంలో తాను హైదరాబాద్లోనే పుట్టానని వెల్లడించారు. ఇక, ఆమె హౌస్లోకి వెళ్లే ముందు నాగ్ ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆనీ మాస్టర్కు భర్త, కుమారుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చివర్లో తనతో పాటు డ్యాన్స్ చేయమని నాగార్జునను కోరగా దానికి ఆయన నిరాకరించాడు. దీంతో ఆనీ మాస్టర్ హౌస్లోకి అడుగు పెట్టేశారు.