Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
కవల పిల్లలతో అంకితా లోఖండే.. ఆ ఇద్దరు చిన్నారులు ఎవరంటే..
సుశాంత్ సింగ్ మరణం తర్వాత పీకల్లోతు విషాదంలో మునిగిపోయిన మాజీ ప్రేయసి అంకితా లోఖండే దాదాపు రెండు నెలల తర్వాత ఆనంద క్షణాలను ఆస్వాదించింది. తన సోషల్ మీడియా అకౌంట్లో కవల పిల్లలను ఒడిలో పెట్టుకొని నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అందరికీ ఓ ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకు ఆ కవల పిల్లలు ఎవరంటే..
Recommended Video
సుశాంత్తో ఏడేళ్లు డేటింగ్
అంకితా లోఖండేకు దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో అఫైర్ దాదాపు ఏడేళ్లపాటు సాగింది. పవిత్ర రిస్తా సీరియల్ షూట్ సందర్భంగా జరిగిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకొనేంత వరకు దారి తీసింది. అయితే వారిద్దరి మధ్య బ్రేకప్ జరగడంతో ఆ బంధాన్ని బ్రేక్ పడింది.
సుశాంత్ మరణం తర్వాత
సుశాంత్ మరణం తర్వాత విషాదంలో కూరుకుపోయారు. అలాగే పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయన కుటుంబానికి అంకిత లోఖండే అండగా నిలిచింది. వారి విషాదాన్ని పంచుకొంటూ సుశాంత్ ఫ్యామిలీకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నది. సుశాంత్ కుటుంబంతో కలిసి న్యాయ పోరాటంలో భాగంగా నిలిచింది. సుశాంత్కు డిప్రెషన్కు గురికాలేదని స్పష్టం చేస్తున్నారు.
సుశాంత్తో బ్రేకప్ తర్వాత వికీ జైన్తో
ఇక సుశాంత్ సింగ్తో బ్రేకప్ తర్వాత వికీ జైన్తో ప్రేమలో పడింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో వికీ జైన్ కుటుంబంలో జన్మించిన అబీర్, అబీరా ఫోటోలను షేర్ చేశారు. మా ఫ్యామిలీలో కవలలు జన్మించడంతో మరింత ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. అబీర్, అభీరాకు స్వాగతం అని తన పోస్టులో పేర్కొన్నది.
కవల పిల్లల ఫోటోలు షేర్ చేసి..
అంకిత లోఖండే షేర్ చేసిన అబీరా, అబీర్ ఫోటోలు వికీ జైన్ సొదరికి పుట్టిన పిల్లలు. కవలల ఫోటోలను తన వికీ జైన్కు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా తన సహచర టెలివిజన్ నటులు కరణ్ వీర్ బోరా, నిషా రావల్, కరణ్ పటేల్, మృణాల్ ఠాకూర్ లాంటి శుభాకాంక్షలు అందజేశారు.