Don't Miss!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- News Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కవల పిల్లలతో అంకితా లోఖండే.. ఆ ఇద్దరు చిన్నారులు ఎవరంటే..
సుశాంత్ సింగ్ మరణం తర్వాత పీకల్లోతు విషాదంలో మునిగిపోయిన మాజీ ప్రేయసి అంకితా లోఖండే దాదాపు రెండు నెలల తర్వాత ఆనంద క్షణాలను ఆస్వాదించింది. తన సోషల్ మీడియా అకౌంట్లో కవల పిల్లలను ఒడిలో పెట్టుకొని నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అందరికీ ఓ ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకు ఆ కవల పిల్లలు ఎవరంటే..
Recommended Video
సుశాంత్తో ఏడేళ్లు డేటింగ్
అంకితా లోఖండేకు దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో అఫైర్ దాదాపు ఏడేళ్లపాటు సాగింది. పవిత్ర రిస్తా సీరియల్ షూట్ సందర్భంగా జరిగిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకొనేంత వరకు దారి తీసింది. అయితే వారిద్దరి మధ్య బ్రేకప్ జరగడంతో ఆ బంధాన్ని బ్రేక్ పడింది.
సుశాంత్ మరణం తర్వాత
సుశాంత్ మరణం తర్వాత విషాదంలో కూరుకుపోయారు. అలాగే పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయన కుటుంబానికి అంకిత లోఖండే అండగా నిలిచింది. వారి విషాదాన్ని పంచుకొంటూ సుశాంత్ ఫ్యామిలీకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నది. సుశాంత్ కుటుంబంతో కలిసి న్యాయ పోరాటంలో భాగంగా నిలిచింది. సుశాంత్కు డిప్రెషన్కు గురికాలేదని స్పష్టం చేస్తున్నారు.
సుశాంత్తో బ్రేకప్ తర్వాత వికీ జైన్తో
ఇక సుశాంత్ సింగ్తో బ్రేకప్ తర్వాత వికీ జైన్తో ప్రేమలో పడింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో వికీ జైన్ కుటుంబంలో జన్మించిన అబీర్, అబీరా ఫోటోలను షేర్ చేశారు. మా ఫ్యామిలీలో కవలలు జన్మించడంతో మరింత ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. అబీర్, అభీరాకు స్వాగతం అని తన పోస్టులో పేర్కొన్నది.
కవల పిల్లల ఫోటోలు షేర్ చేసి..
అంకిత లోఖండే షేర్ చేసిన అబీరా, అబీర్ ఫోటోలు వికీ జైన్ సొదరికి పుట్టిన పిల్లలు. కవలల ఫోటోలను తన వికీ జైన్కు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా తన సహచర టెలివిజన్ నటులు కరణ్ వీర్ బోరా, నిషా రావల్, కరణ్ పటేల్, మృణాల్ ఠాకూర్ లాంటి శుభాకాంక్షలు అందజేశారు.