Don't Miss!
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పబ్లిక్లో కామెడీ స్టార్స్ కమెడియన్ల కొట్లాట: చీప్గా ఉందంటూ అషు రెడ్డి పోస్ట్.. వీడియో వైరల్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో లోకల్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును అందుకుంది. అదే సమయంలో వరుసగా ఆపర్లను కూడా దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో అషు రెడ్డి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఇద్దరు కమెడియన్లు కొట్టుకుంటూ కనిపించారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!
వాటితో పరిచయం... ఇలా పాపులారిటీ
చాలా కాలం క్రితం తెలుగు రాష్ట్రాల్లో డబ్స్మాష్ వీడియోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీటి వల్లే అషు రెడ్డి ఎనలేని క్రేజ్ను దక్కించుకుంది. అంతేకాదు, జూనియర్ సమంతగానూ ఆమె పేరును తెచ్చుకుంది. ఆ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. దాని తర్వాత బిగ్ బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్గా కనిపించింది.
కామెడీ స్టార్స్లో సందడి చేస్తోన్న అషు
స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' ద్వారా బుల్లితెరపైనా అషు రెడ్డి బిజీ అయింది. ఇందులో హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఈ అమ్మడు తన అందచందాలను చూపించడంతో పాటు కామెడీని కూడా పంచుతూ సందడి చేస్తోంది. దీనితో పాటు యాంకర్ రవితో కలిసి 'హ్యాపీడేస్' అనే డైలీ షోను కూడా హోస్ట్ చేస్తూ ముందుకు సాగుతోంది.
వాళ్లందరితో కలిసి రచ్చ చేస్తోన్న బ్యూటీ
'కామెడీ స్టార్స్' షోలో పని చేసే కమెడియన్లు, టెక్నీషియిన్లు అందరితోనూ అషు రెడ్డి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్లతో సరదాగా గడుపుతూ పార్టీలు చేసుకోవడం.. ట్రిప్లకు వెళ్లడం వంటి వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అంతేకాదు, ఇంట్లో వాళ్లందరితో కలిసి పలు రకాల గేమ్స్ కూడా ఆడుతుంది. ఈ విషయాలను తనే స్వయంగా వెల్లడించింది.
పబ్లిక్ ప్లేస్లో ఇద్దరు కమెడియన్లు ఫైట్
'పటాస్' అనే షో ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం అయిన కమెడియన్లలో బిందాస్ భాస్కర్, సద్దాం హుస్సేన్, యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరిలు మంచి పేరును దక్కించుకున్నారు. వీళ్లంతా ఇప్పుడు 'కామెడీ స్టార్స్' షో చేస్తున్నారు. ఇందులో తమదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇందులో బిందాస్ భాస్కర్, ఎక్స్ప్రెస్ హరి పబ్లిక్ ప్లేస్లో కొట్టుకున్నారు.
మొత్తం వివరిస్తూ వీడియో తీసిన సద్దాం
టాప్ కమెడియన్ సద్దా హుస్సేన్ వాళ్లిద్దరూ కొట్లాడుతోన్న దృశ్యాలను సెల్ఫోన్లో బంధించాడు. అందులో అతడు ఏం చెప్పాడంటే.. 'మాకు మూడు రెడ్బుల్ బాటిళ్లు ఇచ్చారు. అందులో ఒకటి నేను, ఇంకోటి యాదమ్మ రాజు తాగుతున్నాం. మూడో దాని కోసం భాస్కర్ గాడు, హరి కొట్టుకుంటున్నారు చూడండి' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది.
Recommended Video
చీప్గా ఉందంటూ అషు రెడ్డి పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అషు రెడ్డి తాజాగా ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అంతేకాదు, దీనికి 'రెడ్బుల్ కోసం ఫైటింగ్ ఏంట్రా చీప్గా' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ వ్యవహారం మరింతగా హైలైట్ అయిపోయింది. ఫలితంగా ఆ ఇద్దరు కమెడియన్ల పరువు పోయినట్లైంది. ఇక, ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.