Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఈ తెలుగు పోగ్రామ్ కే యూనిసెఫ్ అవార్డు...(వీడియో)
హైదరాబాద్: చిన్నారులకు సంబంధించిన కథనాలను అందించిన తెలుగు టీవీ ఛానెళ్లకు యూనిసెఫ్ అవార్డులు అందించింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఓ అవార్డును దక్కించుకుంది. మంగళవారం రాత్రి బంజారాహిల్స్లోని తాజ్డెక్కన్లో 11 విభాగాల్లో అవార్డులను అందించారు. 'చిన్నారుల విద్య' అనే విభాగంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రూపొందించిన 'బాలబడి' అవార్డు పొందింది.
తూర్పుగోదావరి జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో ఏర్పాటైన చిన్నారుల సంరక్షణ కేంద్రాలపై 'బాలబడి' పేరుతో ఈటీవీ ప్రచురించిన ప్రత్యేక కథనం యూనిసెఫ్ అవార్డుకు ఎంపికైంది. చిన్నారుల సంరక్షణ కేంద్రాలపై రూపొందించిన పూర్తి కథనాన్ని ఇక్కడ వీక్షించండి.
అలాగే...
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాజీ ఐఏఎస్, జ్యూరీ ఛైర్పర్సన్ పి.వి.ఆర్.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక యూనిసెఫ్ ప్రతినిధి రుథ్ లియానో, సీఎంఎస్ డైరెక్టర్ పి.ఎన్.వాసంతిలు జ్ఞాపికలు అందజేశారు. ఈటీవీ తరఫున బ్యూరో చీఫ్ నారాయణ జ్ఞాపికను అందుకున్నారు.
ఈటీవీ 'సుఖీభవ'లో ప్రసారమైన 'పిల్లలు అస్వస్థత', బాలలపై చర్చ విభాగంలో 'ప్రాథమిక విద్య స్థితిగతులు' అంశాలపై రూపొందించిన కథనాలు తుది పోటీ వరకు చేరాయి. ఎక్కువ సమయం పిల్లల కోసం కేటాయించిన ఛానెళ్లలో మూడు, నాలుగు స్థానాల్లో ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్లు నిలిచాయి.