ఇన్నాళ్లకు ఆ సంగతి బయటపడింది.. ఇంట్లో దొంగతనాలు చేసేది వారేనట!!
బిగ్ బాస్ షోలో ఒక చోట మాత్రం అందరికీ గొడవలు వస్తుంటాయి. అదే వంటగది. మామూలుగా ఎవరింట్లో అయినా సరే వంటగది వద్దే గొడవలు మొదలవుతుంటాయి. బిగ్ బాస్ ఇంట్లో అయితే మరీ ఎక్కువగా అవుతుంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఇంటికి పరిమిత సంఖ్యలోనే సరుకులను పంపుతాడు. వాటిలో అందరూ అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. అందుకే అక్కడ గొడవలు జరుగుతుంటాయి. పైగా ఎగ్స్, చికెన్, మటన్ వంటి వాటి విషయంలో వాగ్వాదాలు జరుగుతుంటాయి.
ఈ నాల్గో సీజన్లో అయితే మటన్ కోసం పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. ఎందుకంటే మెహబూబ్, సోహెల్ వంటి వారు మటన్ ప్రియులు. పైగా జిమ్ చేసి తెగ కష్టపడి.. మటన్ కోసం రెడీగా ఉంటారు. అలాంటి ఈ ఇద్దరూ ఇంట్లోని గుడ్లన్నీ దొంగతనం చేసేవారట. ఈ విషయం ఇన్నాళ్లు ఎవ్వరికీ తెలియదట. అంటే ఇంట్లో ఎంత సైలెంట్గా తమ నైపుణ్యాలను ప్రదర్శించాలో అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లో తనకు కిచెన్ అంటే ఇష్టమని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో దోశల టాపిక్ వచ్చింది. సోహెల్ పది, పదిహేను దోశలను తింటాడని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎగ్ దోశలు బాగా తింటాడని చెబుతూ.. ఇంట్లో తామే ఎగ్స్ దొంగతనాలు చేశామని, అది ఇన్నాళ్లూ ఎవ్వరికీ తెలీదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అవినాష్ లేచి.. ఇంట్లో నా ఎగ్స్ ఎన్నో మిస్ అయ్యాయని వాపోయాడు. అలా మొత్తానికి సీజన్ ఎండింగ్లో దొంగలు బయటపడ్డారు.
For Live updates
ఇంట్లో దొంగతనాలు చేసేది వారేనట!!
ఇంట్లో తనకు కిచెన్ అంటే ఇష్టమని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో దోశల టాపిక్ వచ్చింది. సోహెల్ పది, పదిహేను దోశలను తింటాడని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎగ్ దోశలు బాగా తింటాడని చెబుతూ.. ఇంట్లో తామే ఎగ్స్ దొంగతనాలు చేశామని, అది ఇన్నాళ్లూ ఎవ్వరికీ తెలీదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అవినాష్ లేచి.. ఇంట్లో నా ఎగ్స్ ఎన్నో మిస్ అయ్యాయని వాపోయాడు. అలా మొత్తానికి సీజన్ ఎండింగ్లో దొంగలు బయటపడ్డారు.


Click it and Unblock the Notifications











