Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీముఖికి ఎసరు పెట్టేందుకు వచ్చింది.. ‘బొమ్మ అదిరింది’లో భాను శ్రీ రీ ఎంట్రీ!!
బొమ్మ అదిరింది షోలో జరిగిన మార్పులు చేర్పులు ఇప్పటికీ అందరిలో కొన్ని అనుమానాలు మిగిల్చింది. యాంకర్లుగా ఉన్న రవి, భానుశ్రీలను తీసేశారు. జడ్జ్గా ఉన్న నవదీప్ను పక్కకు తప్పించారు. వారి స్థానంలో యాంకర్గా భాను శ్రీ, జడ్జ్గా జానీ మాస్టర్ను తీసుకొచ్చారు. షో కూడా బాగానే క్లిక్ అయింది. అంతా బాగానే నడుస్తోంది. ఇందులో ఒక్క భాను శ్రీకి మాత్రమే కాసింత లోటుగా ఉంది. తనను యాంకర్గా తీసేయడంపై అసంతృప్తితో ఉన్నట్టు బాహాటంగానే చెప్పేస్తోంది.
అలా షేర్ చేసేది..
అదిరింది నుంచి భాను శ్రీని తీసేయడంతో ఆమె ఫ్యాన్స్ బాగానే ఫీలైనట్టు తెలుస్తోంది. బొమ్మ అదిరింది షోలోకి మళ్లీ రావాలి అక్కా అని ఫ్యాన్స్ కోరుతున్న పోస్ట్లను భాను శ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసేది. పరోక్షంగా తనకు కూడా బొమ్మ అదిరిందిలోకి రావాలనే కోరిక ఉందని తెలిపింది.
మొన్నటి దసరా ఈవెంట్లో..
మొన్నటి దసరా ఈవెంట్లో భాను శ్రీ తన మనసులోని కోరికను బయట పెట్టేసింది. శ్రీముఖి చెప్పినట్టుగా లెటర్ చదువుతూ.. బొమ్మ అదిరింది షోలో నేను యాంకర్గా బాగా చేయడం లేదు.. మళ్లీ భాను శ్రీని తీసుకోండి అంటూ మార్చి చదివేసింది. ఇలా తన మనసులోని కోరికను మరో సారి భాను శ్రీ బయటపెట్టింది.
స్కిట్లో చేయడానికి..
వచ్చే వారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో తాజాగా వైరల్ అయింది. ఇందులో వేణు, ధన్ రాజ్ స్కిట్లో భాను శ్రీ గెస్ట్గా ఎంట్రీఇచ్చింది. నాలుగు ఎపిసోడ్లో పిలిస్తే రాలేదట. కానీ శ్రీముఖి యాంకరింగ్, ఆ సీటుపై స్కిట్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చిందిట. ఆ స్కిట్లోనూ భాను శ్రీకి శ్రీముఖి సీటు మీద కన్ను పడింది.
Recommended Video
ఎంత మంది వస్తారో..
స్కిట్లో భాగంగానే కొన్ని డైలాగులు చెప్పినా కూడా అవి నిజజీవితానికి వర్తిస్తాయి. మా ఆవిడకు నీ సీటు కావాలంటా. యాంకర్గా కాస్త గ్యాప్ ఇవ్వొచ్చుకదా అని ధన్ రాజ్ శ్రీముఖిని కాకపట్టాడు. కాస్త గ్యాప్ ఇస్తే ఎంతమంది వస్తారో నాకంటే ఎక్కువగా నీకే తెలుసు కదా అని జబర్దస్త్ నాటి విషయాలను పరోక్షంగా ధన్ రాజ్కు గుర్తు చేసింది.