Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్లౌజ్ ఇరిటేట్ చేయడం వల్లే.. భానుశ్రీ! ఛీ.. అంత గలీజ్గా మాట్లాడొద్దు సమ్రాట్
Recommended Video
బిగ్బాస్2 తెలుగులో రెండు జంటల మధ్య చిగురిస్తున్న అఫైర్ అంశమే ప్రధానంగా మారింది. సామ్రాట్, తేజస్విని, అలాగే తనీష్, సునైన మధ్య పెరుగుతున్న ప్రేమ, అప్యాయతలపై ఇంటి సభ్యులు రకరకాలుగా చెవులు కొరుకొంటున్నారు. సోమవారం నాటి ఎపిసోడ్లో ఈ రెండు జంటల గురించే ఎక్కువగా చర్చ జరిగింది. తనపై ఇంటి సభ్యులు మాట్లాడుకొంటున్న తీరుపై తేజస్విని మనస్తాపం చెందింది.
నాని ‘ఇంకా' అనడంపై
ఆదివారం నాటి ఎపిసోడ్లో హోస్ట్ నాని.. సామ్రాట్తో చనువుగా ఉండటం గురించి ‘ఇంకా' ‘ఇంకా' అంటూ ఆటపట్టించడంపై బాబు గోగినేనితో చెప్పుకొని తేజస్విని బాధపడింది. ఇంట్లో ప్రతీ ఒక్కరు రకరకాలుగా తన ముందే మాట్లాడుకోవడంతో కలత చెందాను అని తేజస్విని భోరుమంది.
సామ్రాట్కు అలా దగ్గరయ్యా
శ్యామల, గీతామాధురీ, దీప్తి, భానుశ్రీ తదితరులు రాత్రి తన బెడ్ పక్కనే కూర్చొని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. పెళ్లైనా సామ్రాట్తో రిలేషన్ ఏమిటని నాకు వినిపడే విధంగా నానా మాటాలు అన్నారు. వాళ్లు అనుకొంటున్నట్టు మా మధ్య అలాంటి రిలేషన్ లేదు. సమ్రాట్ జెన్యునిటీ కారణంగానే దగ్గరయ్యాను అని తేజస్విని చెప్పింది.
గలీజ్గా మాట్లాడుతున్నారు.. సామ్రాట్
తేజస్వినిపై కొందరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై సామ్రాట్ మండిపడ్డారు. ఊళ్లలో కూడా ఇలాగ మాట్లాడుకోరు. చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు అని విసుక్కొన్నాడు. సమయం చూసుకొని ఇంటి సభ్యులతో మాట్లాడుతాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకోను అని సామ్రాట్ అన్నారు.
సీక్రెట్ టాస్క్తో గంభీరంగా హౌస్
బిగ్బాస్ సూచన మేరకు అమిత్, తనీష్ సీక్రెట్ తర్వాత ఇంటి వాతావరణం గంభీరంగా మారిపోయింది. తనీష్, సునైన రిలేషన్ గురించి ఇంటి సభ్యులు ఏదో మాట్లాడుకుంటున్నారని బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు అని అమిత్ చెప్పడం పెద్ద చర్చకు దారి తీసింది.
భానుశ్రీకి తేజస్విని వార్నింగ్
తనీష్, సునైన అఫైర్తోనే కాకుండా సామ్రాట్, తనను గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పు అని భాను శ్రీని తేజస్విని హెచ్చరించింది. దాంతో తాను అలా అనలేదని భానుశ్రీ చెప్పింది. మా గురించి చిరాకు ముఖం పెట్టి ఎందుకు అలా మాట్లాడవని తేజస్విని నిలదీయగా.. అందుకు నా బ్లౌజ్ నన్ను ఇరిటేట్ చేసింది. దాంతో చిరాకుతో మాట్లాడాల్సి వచ్చింది అని భానుశ్రీ వివరణ ఇచ్చింది.