Bhanumathi April 14th Episode : పార్ధుకి నిజం చెప్పబోయిన భానుమతి .. కూతురిని చావబాదిన కోటి
మా నాన్నకి ఇంత అవమానం జరగడానికి కారణమైన అమ్మాయిని? నా కుటుంబం కన్నీటికీ కారణమైన అమ్మాయిని వదిలిపెట్టనని ఆవేశంతో అంటాడు పార్దు. అతని మాటలతో భానుమతి, వసులు వణికిపోతారు. నాన్నగారు జైలు నుంచి బయటికి వచ్చాక మళ్లీ పెళ్లి గురించి మాట్లాడదామని చెబుతాడు. పార్ధు మాటలతో కోటి, ప్రమీల, కుమారిలు సంతోషిస్తారు. బలరామ్ను బయటికి తీసుకురావడం కోసం పార్ధు పోలీస్ స్టేషన్లో ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఎస్ఐతో మాట్లాడి ముందు ఫోన్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. మనిద్దరం తర్వాత యుద్ధం చేసుకుందామని మీకు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో చెప్పమని అడుగుతాడు పార్ధు. ఇప్పుడు సమస్య , పగ రెండూ నావేనని.. మీకు ఆ అమ్మాయి ఎవరో చెప్పనని తేల్చిచెబుతాడు ఎస్ఐ. మీకు ఎంత కావాలో చెబితే పడేస్తానని పార్ధు చెప్పడంతో ఎస్ఐ కోపంతో ఊగిపోతాడు. ఇక్కడి నుంచి బయటికి వెళ్లికపోతే నీ మీద ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేస్తానని హెచ్చరిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఏప్రిల్ 14వ తేదీ ఎపిసోడ్ 31లో ఏం జరిగిందంటే?

పెళ్లి ఆపమని ఫోన్ చేసింది భానుమతేనని తెలుసుకున్న కోటి.. ఆ నిజం బయటపడకుండా కవర్ చేస్తాడు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండా వదిలేయడమే మంచిదని అంటాడు. ఆ మాటలతో పార్ధు రగిలిపోతాడు. ఇది మా నాన్న పెద్దరికానికి సంబంధించిన విషయమని , మా కుటుంబం పరువు ప్రతిష్టలకి చెందిన విషయమని అంటాడు పార్ధు. ఎప్పటికీ మరిచిపోలేని అవమానాన్ని ఎదుర్కొన్నారని , అలాంటి అమ్మాయిని ఎలా వదిలేస్తానని అంటాడు పార్ధు. ఆ అమ్మాయిని క్షమించనని, దొరకడం లేదని వదిలిపెట్టనని చెబుతాడు. పార్ధు మాటలతో కోటికి ముచ్చెమటలు పడతాయి.
ఎస్ఐ గారికి ఫోన్ చేసింది భానుమతేనని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటాడు కోటి. ఆ వెంటనే సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వెళ్లి భానుమతిని పిలుస్తాడు. ఇంతలో ప్రమీల వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. ముందు నీ పెద్ద కూతురిని పిలవమని మండిపడతాడు కోటి. అసలు ఏమైంది? విషయం చెప్పవు, వివరం చెప్పవు అంటూ కుమారి ఫైర్ అవుతుంది. మనికి ఏదైనా సమస్య వస్తే ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అని వంద దారుల్లో వెతుకుతుంటామని అంటాడు కోటి. కానీ మన వెనకాలే ఉండి, మనకే వెన్నుపోటు పొడిచే వ్యక్తి వల్లే ఆ సమస్య వచ్చిందని మనం గుర్తించలేకపోతామని చెబుతాడు.
అలాగే మన ఇంటిలోనూ ఒక విషయం జరిగిందని అంటాడు కోటి. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్? విషయం చెప్పమని అడుగుతుంది ప్రమీల. ముందు నీ పెద్ద కూతురిని పిలువు అని రంకెలు వేస్తాడు కోటి. ఆ మాటలతో వసు టెన్ష్ పడుతుంది. భానుమతి కోసం ఇల్లంతా వెతికినా ఆమె కనిపించదు. అది ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని కోటికి చెప్పగా.. దానిని ఒక కంట కనిపెట్టకపోవడం వల్లే ఈరోజు మన కంట్లో పొడిచిందని అంటాడు కోటి. వసు టెన్షన్ పడుతుండటంతో కోటికి అనుమానం వచ్చి అక్క ఎక్కడని అడుగుతాడు.
అక్క ఎక్కడికి వెళ్లిందని గట్టిగా నిలదీయడంతో బయటికి వెళ్లిందని చెబుతుంది వసు. ఆ మాటలతో ప్రమీల, కూమారి షాక్ అవుతారు. భాను బయటికి వెళ్లిందన్న విషయం చిన్న కూతురికి తెలిసింది కానీ, కన్నకూతురికి తెలియలేదని మండిపడతాడు కోటి. ఇంట్లో ఏదో జరగబోతోందని డౌట్ వచ్చి.. మీ అక్క ఎక్కడికి వెళ్లిందని వసును అడుగుతాడు. జీపు అబ్బాయిని కలవడానికి వెళ్లిందని చెప్పడంతో కోటి షాక్ అవుతాడు. అది అల్లుడుగారితో ఏం చెబుతుందోనని భయపడ్డ కోటి వెంటనే బయల్దేరతాడు.
ఈ బాధను ఈ భారాన్ని గుండెల్లో మోయలేనని నిజం జీపు అబ్బాయికి చెప్పేస్తానని అనుకుంటుంది భానుమతి. ఆ అమ్మాయి ఎవరో ఎస్ఐ చెప్పేలా కనిపించడం లేదని మన తెలివి తేటలు చూస్తే అంతంత మాత్రమే అంటాడు సూరి. నా వెనకాల గొప్పగొప్ప చదువులు లేకపోవచ్చు.. కానీ మా నాన్నకి అవమానం జరిగిందనే ఆవేశం ఉందని , అదే నాకు ఆయుధంగా మారుతుందని అంటాడు పార్ధు. ఆ అమ్మాయి ఎక్కడుందో దారి చూపిస్తుందని చెబుతాడు.
భానుమతిని వెతుకుతూ సైకిల్ మీద వెళ్తూ.. ఈ ఆడపిల్లలు, అగ్గిపుల్లలు ఒకటేనని పద్ధతిగా చూసుకోబోతే ఏది తగలబెట్టి చస్తారో తెలియడం లేదని అనుకుంటాడు కోటి. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే వరకు మనం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకూడదని పార్ధు బయల్దేరుతుండగా భానుమతి పిలుస్తుంది. ఆమెను చూసి షాకైనా పార్ధు.. మీతో నేను కొంచెం మాట్లాడాలని అంటుంది భానుమతి. నేను ఎప్పుడూ ఎవరి విషయంలోనూ ఏ తప్పు చేయలేదని , ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదని ఎందుకంటే ఆ తప్పు నన్ను కలకలం వెంటాడుతూ ఉంటుందని భయపడతానని అంటుంది. నేను బాధపడటానికైనా సిద్ధపడతాను కానీ, అవతలి వాళ్లను బాధపెట్టనని చెబుతుంది.
నిన్ను చూసినవాళ్లు, నీ గురించి తెలిసినవాళ్లు .. ఎవరిని అడిగినా ఈ విషయాలన్నీ చెబుతారని అంటాడు పార్ధు. అవన్నీ నాకే ఎందుకు చెప్పాలని అనుకుంటున్నావని అడుగుతాడు. నీకు చెప్పకపోతే ఏదో తప్పు చేసిన భావనలో జీవితాంతం బాధపడాల్సి వస్తుందని అంటుంది భానుమతి. నువ్వేం తప్పు చేశావ్? నీ వల్ల ఎవరు బాధపడ్డారని అడుగుతాడు పార్ధు. భానుమతి నిజం చెబుతుండగా కోటి రావడం చూసి ఆగిపోతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఆడపిల్లని లోకం కాకుల్లా పొడుస్తుందని, భాను దాని గురించే బాధపడుతుందని చెబుతాడు కోటి.
పార్దు వెళ్లగానే భానుమతిని చితకబాదుతాడు కోటి. ఇంట్లో ఏం జరుగుతుందో అర్ధం కాక వసుపై కోప్పడుతుంది ప్రమీల. ఇంతలో భానుమతిని లాక్కొచ్చి ఇంట్లో పడేస్తాడు కోటి. వయసుకొచ్చిన పిల్లతో ఇలాగేనా ప్రవర్తించేదని అంటుంది ప్రమీల. అది ఏం చేసిందో తెలిస్తే నువ్వే నాలుగు పీకుతావని అంటాడు కోటి. దీని పెళ్లి ఇదే చేతులారా చెడగొట్టుకుందని.. ఆ రోజు భానుమతి మైనర్ అని, పెళ్లి ఆపాలని ఎస్ఐకి ఫోన్ చేసింది ఎవరో కాదు ఇదేనని చెబుతాడు కోటి. ఆ మాటలతో ప్రమీల, కుమారి షాక్ అవుతారు.
భానుమతిని కోటి కొట్టబోతుండగా ప్రమీల అడ్డుపడటంతో ఆమెను పక్కకి నెట్టేస్తాడు కోటి. దీంతో ప్రమీల నుదుటికి దెబ్బ తగులుతుంది, అయినప్పటికీ కూతురిని చితకబాదుతాడు కోటి. ఇది చేసిన పనికి బలరామ్ గారికి ఏమైందో మరిచిపోయావా? అని మండిపడతాడు కోటి. ఒక పక్క ఫోన్ చేసిన అమ్మాయి కనిపిస్తే కాళ్లు విరగ్గొట్టాలని పార్ధు వెతుకుతున్నాడని.. ఇదంతా చేసింది ఇదేనని తెలిస్తే నరికేస్తారని అంటాడు కోటి. నీ పెళ్లిని నువ్వే చెడగొట్టుకున్నావా అని కూతురిని ప్రశ్నిస్తుంది. ఎందుకిలా చేశావ్ అని నిలదీయగా .. చదువుకోవడానికి అని చెబుతుంది భానుమతి.
నేను చదువుకుంటానని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని.. కానీ ఎవ్వరూ నా మాట వినలేదని అంటుంది భాను. పెళ్లి ఆపడానికి నాకు మరో మార్గం దొరక్క అలా చేశానని చెబుతుంది. పెళ్లి పీటల వరకు వెళ్లిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటుంది ప్రమీల. ఇదంతా చేసింది నువ్వేనని ఏ మాత్రం బయటికొచ్చినా నాలో ఉన్న నీచుణ్ణి బయటికి తీసుకురావాల్సి వస్తుందని కూతురికి వార్నింగ్ ఇస్తాడు కోటి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











