Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మనోభావాలు దెబ్బతీస్తున్నారని టీవీ షో పై ముస్లింల కేసు
హైదరాబాద్: కలర్స్ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న టెలివిజన్ రియాల్టీ షో బిగ్బాస్ (సీజన్7)ను నిషేధించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. జన్నత్ (స్వర్గం), జహన్నుమ్ (నరకం) పేరిటి ముస్లింల మనోభావాలను దెబ్బతీసేవిధంగా కార్యక్రమాన్ని రూపొందించారని పేర్కొంటూ హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఫసీయుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో ప్రతివాదులుగా బిగ్బాస్ షోకు అతిథేయిగా వ్యవహరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో పాటు బిగ్బాస్ సీజన్-7 టీవీ షో దర్శక, నిర్మాత సంస్థ ఎన్డోమోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ను, బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇక గతంలోనూ బిగ్ బాస్ 4 రియాల్టీ షోలో అసభ్యత చోటు చేసుకుందనే ఆరోపణపై ఉత్తరప్రదేశ్ కోర్టులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. ఆ రియాల్టీ షో నిర్మాత, దర్శకుడు, కొంత మంది పోటీదారులపై కూడా కేసు నమోదైనట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా కోర్టులో వారిపై ఈ కేసు నమోదైంది.
అలీగఢ్ కు చెందిన అనూప్ కౌశిక్ అనే న్యాయవాది చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆ కేసును దాఖలు చేశారు. అనూప్ కుమార్ బిగ్ బాస్ పై ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోను ప్రసారం చేస్తున్న చానెల్ మేనేజింగ్ డైరెక్టర్, షో దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేసినట్లు అనూప్ కౌశిక్ చెప్పారు.