Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Karthika Deepam వంటలక్క ఆరోగ్యం మరింత విషమంగా.. దీపకు గుండె మార్పిడి తప్పదా?
మోనితను అరెస్ట్ చేయించిన తర్వాత ఏసీపీ రోషిణికి సౌందర్య ఫోన్ చేసింది. మోనిత ఏదైనా చెప్పిందా అంటే.. లేదు.. ఎంత అడిగినా తనకు తెలియదని చెబుతున్నది. కావాలంటే నా జైలు శిక్షను ఉరిశిక్షగా మార్చండి అని చెప్పిందట.. అంతేకాకుండా కార్తీక్ ఫోటోను తన గదిలో పెట్టుకొనేందుకు తనకు అనుమతి ఇవ్వమని మోనిత దరఖాస్తు చేసుకొందనే విషయాన్ని భర్త ఆనందరావుతో సౌందర్య షేర్ చేసుకొన్నది.
దాంతో దానిని చంపేయమని చెప్పు సౌందర్య.. పీడ విరగడైపోతుంది అని ఆనందరావు అన్నారు. దాంతో నీవు అంత ఎందుకు ఫ్రస్టేట్ అవుతున్నావు అని సౌందర్య అంటే.. ఫ్రస్టేషన్ కాదు.. బాధ అని ఆనందరావు చెప్పాడు. ఇంకా కార్తీకదీపం సీరియల్ 1527 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?
దీపకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్
మోనిత అరెస్ట్ చేసిన విషయాన్ని బోటిక్లో పనిమనిషి చెప్పడంతో తన తల్లి తన కోసం వచ్చిందనే విషయాన్ని తెలుసుకొన్న కార్తీక్.. వెంటనే హైదరాబాద్కు వెళ్లాలనే ఆతృతతో దీప వద్దకు చేరుకొన్నాడు. అమ్మ తమ కోసం వెతుకుతున్నది. మనం వెతుకున్నట్టే మన ఫ్యామిలీ కూడా వెతుకుతున్నారు అని కార్తీక్ అన్నాడు.
అయితే అమ్మ వాళ్లు యూఎస్ఏకు వెళ్లలేదా? మనం శౌర్య కోసం వెతుకుతూ హిమను మరిచిపోయాం. వెంటనే మనం వెళ్లి అమ్మ, నాన్నలను కలుద్దామని అనుకొన్నారు. హైదరాబాద్కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న మాటలు విని.. డాక్టర్ చారుశీల రిపోర్టులు వచ్చాక వెళ్లండి అని సూచించింది. అయితే దీప రిపోర్టులు చూసిన డాక్టర్ చారుశీల షాక్ తిన్నది. ఈ రిపోర్టుల గురించి దీప, కార్తీక్కు చూపించవద్దు.. గుండె ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంది అని డాక్టర్ చారుశీల చెప్పింది.
కారులో బయలుదేరుతూ కార్తీక్, దీప
అయితే హైదరాబాద్కు ఫ్లయిట్లో వెళ్దామని కార్తీక్ అంటే.. లేదు.. కారులో వెళ్దాం. చారుశీల కారులోనే వెళ్లి వద్దామని దీప పట్టుబట్టింది. డాక్టర్ చారుశీల కారులో మెల్లమెల్లగా వెళ్లి వద్దాం అని దీప చెప్పింది.
అయితే కారులో దీప, కార్తీక్ వెళ్లి వెళ్లడానికి బయలుదేరుతుండగా.. చారుశీల వచ్చి.. మీతో ఓ పేషెంట్ గురించి మాట్లాడాలి అని అంది. దాంతో ఇప్పుడు అవసరం లేదు. కావాలంటే..నా ఫోనుకు రిపోర్టుల పంపించండి అని కార్తీక్ బయలుదేరారు.
మోనిత కొడుకు కనిపించకపోయే సరికి
మోనిత కుమారుడిని లక్ష్మణ్కు ఇచ్చి ఉంటారని భావించిన సౌందర్య, ఆనందరావు ఇద్దరు అక్కడి వెళ్లారు. లక్ష్మణ్ ఇంటికి వెళ్లి చూస్తే.. ఎవరో ఉండటంతో వారి గురించి ఆరా తీసింది. లక్ష్మణ్ ఇళ్లు అమ్మేసి వెళ్లిపోయారు. వారు ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు అని ఒకావిడ చెప్పింది.
అయితే లక్ష్మణ్కు ఇంత పెద్ద ఇల్లు ఎక్కడిది? అని అంటే.. ఎవరో ఒక బాబును తెచ్చి ఇచ్చింది. అంతేకాకుండా వాళ్లు పెద్ద కారు కూడా కొన్నారు అని చెప్పింది. అయితే మోనిత ఆనంద్ మనవద్ద పెరగడం ఇష్టం లేదేమో.. అని ఆనందరావు అంటే.. ఎవరు ఎక్కడ పెరుగాలో దేవుడే నిర్ణయిస్తాడని సౌందర్య చెప్పింది.
వారణాసికి ట్యాక్సీ కొనివ్వాలి అంటూ
హైదరాబాద్లో దీప, కార్తీక్ కారులో వెళ్తూ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఇంటిలో అత్తమ్మ, మామకు, హిమకు ఇష్టమైన వస్తువుల గురించి మాట్లాడుకొంటూ వెళ్లారు. అయితే తనకు కొన్ని కోరికలు అలానే మిగిలి ఉన్నాయి. గతంలో నాకు చాలా సేవల చేసిన వారణాసికి ఒక హామీ ఇచ్చాను. ఎంతకాలం ఆటో నడుపుకొంటావు.. ఒక ట్యాక్సీ కొనిస్తాను అని చెప్పాను. మనం వెళ్లిన తర్వాత టాక్సీ కొనివ్వాలి అని దీప చెప్పింది. అయితే.. వారణాసి ప్రస్తుతం హైదరాబాద్లో లేడు. హాస్పిటల్లో ఉన్నాడు అని కార్తీక్ చెప్పాడు.
తల్లిదండ్రులను కలిసిన కార్తీక్
ఇదిలా ఉండగా, హైదరాబాద్ చేరుకొన్న కార్తీక్, దీప తన ఇంటికి వెళ్లగానే.. తల్లిదండ్రులు, కూతురు హిమ కనిపించారు. వారిని చూడగానే కార్తీక్, దీప ఆనందంలో మునిగిపోయారు. అయితే శౌర్య వారితో లేకపోవడం గురించి దీప అడిగితే.. సౌందర్య, ఆనందరావు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. ఏం జరిగిందనే విషయం గురించి కార్తీక్, దీపతో పంచుకొనే అవకాశం ఉంది. అయితే కార్తీక్, దీప కలిసిన విషయం మరోసారి సౌందర్య కల గన్నారా? లేక మరెవరన్నా కలగన్నారా అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుస్తుంది.