Bigg Boss Non Stop : నిజమైన లీకులు.. శ్రీ రాపాక ఔట్.. వెళుతూ వాళ్ళని నమ్మవద్దని కామెంట్స్!
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ మొదల నేటితో(శనివారం) రెండు వారాల అవుతుంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ముందే లీకయింది. ఆ లీకులను నిజం చేస్తూ శ్రీ రాపాక ఎలిమినేటి అయింది. అయితే ఆమె వెళుతూ వెళుతూ కొన్ని కామెంట్లు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

పనిష్మెంట్
ఆదివారం నాడు ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ముందుగా హౌస్ మేట్స్ లో కొంతమందికి క్లాస్ పీకారు నాగార్జున. తిండి వృధా చేసినందుకు చైతుపై నాగార్జున ఫైర్ అయ్యి ఈ రాత్రికి ఉపవాసం ఉండాలని పనిష్మెంట్ ఇచ్చారు. బిందు కూడా ముందుగా ప్లేట్ విసిరి నందున ఆ తప్పు పునరావృతం చేయవద్దని ఆమెను ఆదేశించాడు.

క్లారిటీ కోసం
సరయు మీద స్రవంతి అరిచిన తీరు, గొడవ పెట్టుకోవడం పైన నాగార్జున వివరణ అడిగారు. అలా అన్ని సమస్యలను నాగార్జున పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక, సరయుతో డబుల్ మీనింగ్ లాంగ్వేజ్ వాడినందుకు శివపై నాగ్ మండిపడ్డారు. క్లారిటీ కోసం వీడియో చూపించారు.

మిత్రా సేఫ్
శివ తన తప్పు ఉంటె వెళ్లిపోతానని చెప్పడంతో నాగ్ తలుపులు తెరిచి, హౌస్మేట్లను అతనిని బయటకు పంపాలా? లేదా నిర్ణయించమని కోరాడు. శివకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అందరూ నాగ్ని అభ్యర్థించారు. ఆ తర్వాత నామినేషన్ లో ఉన్న వారితో పలు టాస్క్ లు ఆడించి డేంజర్ జోన్ లో మిత్రా, శ్రీరాపాక, నటరాజ్ మాస్టర్ లు పెట్టారు. వారు ముగ్గురికి ఎగ్స్ టాస్క్ ఇచ్చి గేమ్ ఆడించగా ఆ టాస్క్ లో మిత్రా సేఫ్ అని వచ్చింది.

శ్రీ రాపాకతో గేమ్
ఇక ఫైనల్ గా నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక నామినేషన్ లో మిగిలి ఉండగా.. అందరూ ఊహించినట్లుగానే శ్రీరాపాక ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అసలు ఏ మాత్రం బాధ పడకుండా నవ్వుతూ హౌస్ నుండి బయటకు వెళ్లింది. స్టేజ్ పైకి వెళ్లిన శ్రీ రాపాకతో గేమ్ ఆడించారు నాగార్జున. హౌస్ లో ఎవరిని నమ్మొచ్చో, నమ్మకూడదో చెప్పండి అని నారార్జున అడిగారు. అషురెడ్డి, తేజస్వి, బిందు, అఖిల్, ఆర్జే చైతులను నమ్మొచ్చు అని ఆమె చెప్పింది.
Recommended Video

అలాగే స్రవంతి, మిత్రా
అలాగే స్రవంతి, మిత్రా, అజయ్ లను నమ్మలేమని చెప్పుకొచ్చింది. అరియనా కాన్ఫిడెంట్ గా ఉంటుందని.. నటరాజ్ మాస్టర్ చాలా ఎమోషనల్ అని, సరయు హానెస్ట్ గా ఉంటుందని తన అభిప్రాయం చెప్పింది సరయు. నాగార్జున వెళ్లిన తర్వాత, తేజు మిత్రాని ఓదార్చింది. అలాగే తన మీద ఆరోపణలు చేయడం మానేయమని కోరింది. ఇంతలో, ఆశు, సరయు, బిందు శ్రీ రాపాకతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నటరాజ్ మాస్టర్ తన బేబీని చాలా మిస్ అవుతున్నట్లు స్రవంతితో పంచుకున్నారు. నటరాజ్, స్రవంతి ఇద్దరూ ఎప్పుడూ లేని విధంగా మనసు విప్పి సానుకూలంగా మాట్లాడుకున్నారు.


Click it and Unblock the Notifications











