Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
వరుణ్ సందేశ్కు జాఫర్ వార్నింగ్.. బాబా భాస్కర్ వ్యవహారంపై సీరియస్
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి బయటకు వెళ్లిన రెండో సెలబ్రిటీ యాంకర్ జాఫర్ బాబు. ఈ వారం వితిక ఎలిమినేట్ అవుతుందని భావించిన ప్రేక్షకులకు షాకిస్తూ జాఫర్ బయటకు పంపారు. జాఫర్ బాబు ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.ప్రతీ ఒక్కరు జాఫర్ను ఆప్యాయత, భావోద్వేగాల మధ్య సాగనంపారు. అయితే జాఫర్ వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబు వేశారు. అదేమిటంటే..
వరుణ్ సందేశ్కు జాఫర్ షాక్
వితిక ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడంతో వరుణ్ సందేశ్ గ్రూప్ హ్యాపీగా ఫీలైంది. తన భార్య ఎలిమినేషన్ వేటు తప్పించుకొందనే ఆనందంలో ఉండే వరుణ్కు జాఫర్ షాకిచ్చాడు. బిగ్ గేట్ వద్దకు వెళ్లిన జాఫర్ బయటకు వెళ్లబోతూ.. వరుణ్కు ఓ వార్నింగ్ ఇచ్చారు. బాబా భాస్కర్ మాస్టర్ ఏమి అనొద్దు.. కామెంట్ చేయవద్దు అంటూ హెచ్చరించినంత పనిచేశాడు.
బాబా భాస్కర్ను టార్గెట్ చేయొద్దు
బాబా భాస్కర్ పేరు ఎత్తిన జాఫర్ గద్గద స్వరంతో ఏడిచినంత పనిచేశారు. బాబా భాస్కర్ను టార్గెట్ చేయకూడదు. ఒక్క మాట కూడ అనొద్దు అని జాఫర్ గట్టిగా అనే సరికి అందరూ కంటతడి పెట్టేశారు. బాబా భాస్కర్, శ్రీముఖి, అషురెడ్డి తదితరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
జాఫర్ తప్పుగా తీసుకొన్నాడని
జాఫర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వరుణ్ సందేశ్ షాక్ తిన్నాడు. బాబా భాస్కర్ను నేనేం అనలేదు. నేనేమన్నానా అంటూ ఇతరులతో క్లారిటీ తీసుకొనేందుకు ప్రయత్నించాడు. వితిక వెంటనే స్పందించి ఆయన తప్పుగా అర్ధం చేసుకొన్నాడు అని అన్నారు. అంతేకాకుండా భార్యభర్తలు ఓ రకమైన షాక్లో ఉన్నట్టు కనిపించారు. ఇలాంటి షాక్తో బిగ్బాస్ హౌస్లో రెండు గ్రూపులు ఉన్నట్టు స్పష్టమైంది. ఇదే విషయాన్ని వేదిక మీద నాగార్జునతో కూడా అన్నారు.
వరుణ్ సందేశ్ గ్రూప్కు వైస్ కెప్టెన్గా
ఎలిమినేషన్లో భాగంగా వేదికపైన నిర్వహించిన ముఖాముఖిలో వరుణ్, రాహుల్ను సూటిగా జవాబు చెప్పమని ప్రశ్నించారు. వరుణ్ సందేశ్ గ్రూపుకు నీవు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నావా? అని ప్రశ్నించాడు. దాంతో ఎవరు ఎలా అనుకొంటే అలా.. నేను నాలాగానే ఉంటున్నాను అని రాహుల్ సమాధానమిచ్చారు. దీంతో రెండు గ్రూపుల మధ్య విభేదాలు ఉన్నట్టు అనిపించింది. రానున్న రోజుల్లో ఇలాంటి విభేదాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.