Don't Miss!
- News సజ్జలతో సహా ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఈసీ షాక్; గీత దాటితే వేటే!!
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
మొదటి రోజే శ్రీముఖి, బాబా భాస్కర్కు బిగ్బాస్ షాక్.. కెప్టెన్గా బంపర్ ఆఫర్ ఎవరికంటే
బిగ్బాస్ 3 సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది. హోస్ట్గా హీరో నాగార్జున ఆకట్టుకొన్నాడనే మాట వినిపిస్తున్నది. ఈ క్రమంలో 15 మంది సెలబ్రిటీలు బిగ్బాస్ ఇంటిలో సందడి చేస్తున్నారు. ఇంటిలోకి వెళ్లగానే అషురెడ్డి, రవికృష్ణ, సావిత్రికి ఇచ్చిన టాస్క్ గురించి బిగ్బాస్ అడిగి తెలుసుకొన్నారు. ఈ ముగ్గురు సెలబ్రిటీలు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు ఇచ్చిన సమాధానాల ఆధారంగా సెలబ్రిటీలను నామినేట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
నామినేషన్లో ఆరుగురు సెలబ్రిటీలు
తొలిరోజు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు చెప్పిన జవాబులను ఆధారంగా చేసుకొని అషురెడ్డి, రవికృష్ణ, సావిత్రి కలిసి ఒక్కక్కొరికి ర్యాంకింగ్లు ఇచ్చారు. వాటి ఆధారంగా శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్ బాబు, హిమజ, వరుణ్ సందేశ్, రాహుల్ను నామినేట్ చేశాడు. దాంతో మొదటి రోజే బిగ్బాస్ షాక్ ఇవ్వడంతో అందరూ షాక్ గురయ్యారు.
ఇంటి పనుల్లో సభ్యులు
ఇక ఇంటిలోని వస్తువులను నీట్గా సర్దుకొన్నారు. మహేష్ విట్ట బాత్రూంను క్లీన్ చేశాడు. కొంతమంది స్విమ్మింగ్ పూల్లో దూకి ఈత కొట్టారు. స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడిన శ్రీముఖిని తోయడంతో నీళ్లలో పడిపోయింది. నలుగురు సెలబ్రిటీలు శ్రీముఖిని నీళ్లలో ఆటపట్టించారు. ఇంటిలోకి కొన్ని తిను బండారాలు, వస్తువులను పంపించారు.
నటి హేమకు టాస్క్
బిగ్బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ అప్పగించారు. నటి హేమను కన్ఫెషన్ రూంలోకి పిలిచి టాస్క్ను అప్పగించారు. ఇంటి సభ్యులను అన్యోన్యయంగా ఉండాలని సూచించారు. ఒకరికొకరు సహకారం చేసుకొని ఇంటిని అందంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా మేకప్ చేసుకోవాలంటే వారికి వారికి ఎవరైనా సహాయం చేసుకోవచ్చని బిగ్బాస్ చెప్పాడు.
కెప్టెన్గా హేమ ఎంపిక
ఇక ఎలిమినేషన్ రౌండ్ను తప్పించుకోవడానికి ఆరుగురికి బిగ్బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. మిగిలిన తొమ్మిది మందిలో ఒకరిని మానిటర్ (కెప్టెన్)గా ఎన్నుకోవాలని సూచించగా.. ఆరుగురు కలిసి హేమను నాయకురాలిగా ఎన్నుకొన్నారు. అనంతరం కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఓ టాస్క్ను ఇచ్చాడు. నామినేట్ అయిన ఆరుగురిలో ఒకరిని గుడ్ ప్లేస్లో ఉండేలా నిర్ణయం తీసుకొనే అధికారాన్ని మానిటర్కు అప్పగించారు.
నటి హేమకు బిగ్బాస్ పవర్
నామినేట్ అయిన సభ్యుల్లో నుంచి ఒకరిని రక్షించే అవకాశం హేమకు ఇచ్చారు. అలా ఎందుకు రక్షించేందుకు నిర్ణయం తీసుకొన్నారో... మరొకరిని ఎలిమినేట్ చేయడానికి డిసైడ్ అయ్యారో మానిటర్ చెప్పాల్సి ఉంటుంది. దాంతో హేమలో కొంత కంగారు మొదలైంది. తాను ఎవరిని సేఫ్ చేస్తే.. మరొకరికి శత్రువుగా మారుతానా అనే భయం ఆమెను వెంటాడింది.