Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చెప్పు తెగుద్ది.. రాహుల్ కు పునర్నవి వార్నింగ్..
రత్నాలే రాళ్లు ఏమో కానీ.. అవి ఏరుకోలేక.. ఒకరిని నుంచి దోచుకోలేక నానా అవస్థలు పడ్డారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు. పదకొండో వారంలో నామినేషన్ ప్రక్రియను డిఫరెంట్ గా ప్లాన్ చేసిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ను తిప్పలు పెట్టాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ పూర్తి చేశాడు.
మొదట్నుంచీ టాస్కుల్లో వెనుకబడ్డ రాహుల్..
బిగ్ బాస్ షోలో కనిపిస్తున్నప్పటి నుంచి రాహుల్ కు బయట మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కామెడీ టైమింగ్ తో, ముక్కుసూటి తనంతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో మాత్రం.. కాస్త వెనకబడే ఉంటాడు. రాహుల్ టాస్క్ ఆడితే.. ఫుల్ హైపర్ అవుతాడు. దీంతో ఏదో ఒక గొడవ జరుగుతుంది.
రాళ్లే రత్నాలు టాస్కులో మహేష్ తో గొడవ..
పదకొండో వారంలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. రాళ్లే రత్నాలు అనే టాస్క్ ఇచ్చాడు. టాస్క్లో భాగంగా మహేష్ వద్ద నుంచి ఓ రాయిని తీసుకున్నాడు. దీంతో మహేష్ కాస్త సీరియస్ అయ్యాడు. అయితే కొద్దిసేపటికే..మళ్లీ తన తప్పు తెలుసుకున్నాడు. ఈ టాస్క్లో మొదటగా నామినేట్ ఇంట్లోకి వచ్చాడు రాహుల్.
బ్రెడ్డు ముక్కలు తింటున్నాడని..
నామినేట్ అవ్వడంతో హాయిగా ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. పనిలోపనిగా ఇంట్లో ఉన్న ఫుడ్ ను తింటూ ఉన్నాడు. అయితే తమ వాటాకు వచ్చిన బ్రెడ్ ను కూడా తింటున్నాడని వితికా, పునర్నవి కెప్టెన్ అయిన శ్రీముఖికి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయాన్ని రాహుల్ వద్దకు తీసుకెళ్లింది.
చెప్పు తెగుద్ది.. అన్న పునర్నవి
‘నేను అన్ని బ్రెడ్స్ తినలేద'ని రాహుల్ శ్రీముఖితో చెప్పుకోగా.. అది నాకేం తెలుసు పునర్నవి అలా అన్నదంటూ తిరిగి బదులిచ్చింది. నేను అన్ని తినలేదని చెప్పడం కెప్టెన్ గా నీ బాధ్యత అంటూ శ్రీముఖితో చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని పునర్నవితో చెప్పడంతో చెప్పు తెగుద్ది అని అన్నానని చెప్పు అంటూ పునర్నవి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
నామినేషన్లోకి వచ్చిన నలుగురు
రాళ్లే రత్నాలు టాస్కులో తక్కువ విలువైన రాళ్లను ఏరి రాహుల్, మహేష్, పునర్నవి, వరుణ్ నామినేషన్లోకి వచ్చారు. మీరు ఈ నలుగురిలో ఎవిరికి ఎన్ని ఓట్లు పడతాయో? ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.