Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్ బాస్ లొల్లిని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వీరు... తాజాగా ఆ ఎఫ్ఐఆర్ కాఫీలను పట్టుకుని ఢిల్లీ చేరారు. జాతీయ మహిళా కమీషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపిస్తామని కమీషన్ సభ్యులు హామీ ఇచ్చారని వారు మీడియాకు వెల్లడించారు.
కాగా... శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా చేసిన ఫిర్యాదుపై బిగ్ బాస్ కోఆర్డినేషన్ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
నాగార్జున హోస్ట్గా ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఫిర్యాదులకు తోడు... ఈ రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. తెలుగు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిల్ వేశారు.
కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిల్లో నాగార్జునతో పాటు మరో 10 మందిని ప్రతివాదులుగా చేర్చడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ వివాదాలతో సంబంధం లేకుండా జులై 21 నుంచి ఈ షో ప్రారంభం కాబోతోందని అంటున్నారు.