Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
నామినేషన్లోకి మళ్లీ ఆ ముగ్గురే.. నిజంగానే బాబా స్ట్రాటజీ ప్లే చేశాడా..?
Recommended Video
సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ పన్నెండో వారానికి గానూ హౌస్మేట్స్కు అదిరిపోయే టాస్క్ ఇచ్చాుడు. ట్రాలీలను పార్కింగ్ చేయాలంటూ.. ఎవరు ముందుగా వెళ్లి పార్క్ చేస్తారో వారు సేవ్ అవుతారని, 8 ట్రాలీలను బిగ్ బాస్ పంపించాడు. అయితే ఏడు పార్కింగ్ లైన్లను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. నాలుగు బజర్స్ మోగుతాయని అప్పటి వరకు ఆట ఆడాలంటూ తెలిపాడు.
వరుణ్, వితికా, మహేష్, రాహుల్ నామినేట్..
గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ టాస్క్లో ట్రాలీలను సరిగ్గా పార్కింగ్ చేయలేకపోయిన వరుణ్ సందేశ్, వితికా, మహేష్, రాహుల్ నామినేట్ అయ్యారు. అయితే తనకున్న మెడాలియన్ వాడి.. నామినేషన్ నుంచి తప్పించుకుంది. ఈ టాస్క్లో మూడో బజర్కు.. మహేష్, రాహుల్ పార్కింగ్ విషయంలో సందిగ్గదం ఏర్పడింది. ఎవరు ముందుగా పార్కింగ్ చేశారని అడగ్గా.. తానే పూర్తిగా పార్కింగ్ చేశానని రాహుల్ తెలిపాడు. దీంతో బిగ్ బాస్ మహేష్ నామినేట్ అయినట్లు తేల్చేశాడు.
బాబా నిజంగానే స్ట్రాటజీ ప్లే చేశాడా..?
ట్రాలీ పార్కింగ్ టాస్క్లో.. శ్రీముఖి, అలీకి ఏదో సైగలు చేసింది. రాహుల్ ను చూసుకోండని అనేలా ఓ సైగ చేసినట్టు కనిపించింది. అప్పటికే వరుణ్, వితికా నామినేట్ అవ్వడంతో రాహుల్ ను కూడా నామినేట్ చేయాలని భావించినట్లు కనిపించింది. బాబా భాస్కర్ కావాలనే అందర్నీ ఆపేసి.. శ్రీముఖి, శివజ్యోతి వెళ్లేందుకు సహాయం చేస్తున్నాడని ఆరోపించాడు. అయితే చివరి బజర్లో మాత్రం అది నిజమేననిపించేలానే బాబా ప్రవర్తించాడు. కావాలని చేయడం లేదని బాబా చెప్పుకొచ్చాడు.
రెండు గ్రూపులు.. మధ్యలో మహేష్ వారది..
ఈ రోజు ఎపిసోడ్తో .. బిగ్ బాస్ హౌస్లో రెండు గ్రూపులున్నాయని స్పష్టంగా తెలిసిపోయింది. అయితే మహేష్ మాత్రం ఆ రెండు గ్రూపులతో సత్సంబంధాలు ఏర్పచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అక్కడ వాళ్లతోనూ మంచిగానే ఉంటున్నాడు.. మళ్లీ ఇక్కడ వీరితోనూ అలానే ప్రవర్తిస్తున్నాడు. బాబా, అలీ, శివజ్యోతి, శ్రీముఖి ఓ గ్రూప్ అయిపోయినట్లు అర్థమైపోతోంది.