Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ప్రతీ ముగ్గురు తెలుగువాళ్లలో ఇద్దరు చూశారట.. బిగ్బాస్ షో రికార్డ్!!
బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టీఆర్పీలో గత సీజన్ల రికార్డులను బద్దలుకొట్టేసింది. ఈ దెబ్బకు నాల్గో సీజన్పై ఉన్న ఇంట్రెస్టెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. షో ప్రారంభ వేడుకలకు అయితే అదిరిపోయే రికార్డులు వచ్చాయి. ఓపెనింగ్ సెరమెనీకి వచ్చిన రేటింగ్ బాగానే ఉన్నా.. మొదటి వారం మొత్తానికి వచ్చిన టీఆర్పీ మాత్రం నిరాశ కలిగించింది. తాజాగా స్టార్ మా వారు అధికారికంగా ఓ ప్రకటన చేశారు.
బిగ్బాస్ నాల్గో సీజన్ ప్రారంభ వేడుకలకు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే మొదటి రోజు ఈ రేటింగ్ రావడం ఓ రికార్డ్. గడిచిన మూడు సీజన్లు ఇంతటి రేటింగ్ను రాబట్ట లేకపోయాయి. మొదటి సీజన్ కావడం, అందులోనూ ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో 16.18 రేటింగ్ వచ్చింది. ఇక నాని హెస్ట్ చేసిన రెండో సీజన్కు 15.05, మూడో సీజన్కు 17.9 వచ్చాయి. అయితే ఈ టీఆర్పీ లెక్కలపై స్టార్ మా స్పందించింది.
బిగ్బాస్ ప్రారంభ వేడుకలు అదిరిపోయాయి.. 18.5 టీఆర్పీ రాగా.. దాదాపు 4.5 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించారు.. అంటే ప్రతీ ముగ్గురు తెలుగు వాళ్లలో ఇద్దరూ బిగ్బాస్ షోను వీక్షించారు అంటూ స్టార్ మా సగర్వంగా ప్రకటించింది. దీన్ని బట్టే బిగ్ బాస్ షోకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. కంటెస్టెంట్లు వీక్గా ఉండటంతో.. వారానికి రావాల్సిన టీఆర్పీలో కాస్త వెనుకబడింది. ఇక మున్ముందైనా మ్యాజిక్ జరిగి కాస్త ఇంట్రెస్టింగ్ టాస్క్లు ఇచ్చి ఎంటర్టైన్ చేస్తారేమో చూడాలి.