Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫినాలే ఎపిసోడ్స్కు వెళ్తే మళ్లీ అది తప్పదు.. గంగవ్వతో లాస్య ఫన్నీ కామెంట్స్
బిగ్ బాస్ షోలో ఫినాలె ఎపిసోడ్కు దగ్గరపడుతోంది. చివరి వారంలో ఇంటి సభ్యులు ఫుల్ చిల్ అవుతున్నారు. ఇక మిగిలింది రెండు మూడు రోజులే. ఫినాలె ఎపిసోడ్కు సర్వం సిద్దమవుతోంది. ప్రతీసారిలా ఈ సారి గ్రాండ్ సెలెబ్రేషన్స్ ఉంటాయని అందరూ అంటున్నారు. కానీ కరోనా లాంటి వింత పరిస్థితుల్లో గతంలో మాదిరి హల్చల్ చేసేందుకు చాన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఫినాలె రోజును కంటెస్టెంట్లందరినీ కూడా పిలుస్తారు. ఇదే విషయంపై లాస్య, గంగవ్వలు మాట్లాడుకున్నారు.
లాస్య అలా..
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన లాస్య.. స్పెషల్గా కొన్ని వీడియోలు చేస్తూ వస్తోంది. లాస్యకు ఇంతకు ముందే యూట్యూబ్ చానెల్ ఉంది. అందులో ఇప్పుడు బిగ్ బాస్ షోను వాడేసి స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తోంది. నోయల్, అభిజిత్, హారికల ఫ్యామిలీలతో హోమ్ టూర్ అంటూ ఇంటర్వ్యూలో చేసింది. బాగానే క్లిక్ అయ్యాయి కూడా.
గంగవ్వతోనూ..
బిగ్ బాస్ ఇంట్లో గంగవ్వ, లాస్య, సుజాతలు ముగ్గురు ముచ్చట్లు పెట్టుకునే వీడియోలు ఎంతో వైరల్ అయ్యేవి. ఈ ముగ్గురు కలిసి ఇంట్లో జరిగే సంగతుల గురించి మాట్లాడుకునే వారు. అలా గంగవ్వకు లాస్యకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే గంగవ్వ హోమ్ టూర్ అంటూ స్పెషల్ వీడియోను చేసింది.
కరోనా పరీక్షలు..
కరోనా గురించి మాట్లాడుకుంటూ బిగ్ బాస్ షోలో ఎన్ని సార్లు కరోనా పరీక్షలు చేశారో గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఫినాలె ఎపిసోడ్కు వెళ్తే మళ్లీ పరీక్షలు చేస్తారంటూ గంగవ్వ, లాస్యలు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఫినాలె ఎపిసోడ్కు పిలుస్తామని అన్నారట.. కానీ ఇంకా ఏమీ క్లారిటీ ఇవ్వలేదని లాస్య చెప్పుకొచ్చింది.
లోపలికి పంపించరేమో..
అయితే గతంలోలాగా కంటెస్టెంట్లను లోపలికి పంపించరేమో అనే అనుమానాన్ని లాస్య లేవనెత్తింది. కరోనా కాబట్టి లోపలికి పంపించరేమో అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఫినాలె ఎపిసోడ్కు చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్లలో ఎవరో ఒకరు గెస్ట్లుగా వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మూడో సీజన్కు చిరు గెస్ట్గా వచ్చిన సంగతి తెలిసిందే.