Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలివిగా ఆలోచించిన లాస్య టీమ్.. మనకెందుకొచ్చిమ గొడవ అంటూ..
బిగ్ బాస్ లో మంగళవారం చోటు చేసుకున్న పరిస్థితులు ఒక్కసారిగా హౌజ్ లో అందరిని షాక్ కి గురి చేశాయి. కెప్టెన్సీ పోస్ట్ కోసం మెహబూబ్, అఖిల్ మధ్యలో చర్చలు వాడివేడిగా కొనసాగాయి కానీ ఫలితం మాత్రం దక్కలేదు. టాస్క్ అయితే కష్టపడి పూర్తి చేశాము.. ఎవడో ఒకడు కెప్టెన్ అవుతాడులే అని అనుకున్నారు హౌజ్ మెంట్స్. కానీ ఇద్దరు నేనంటే నేను అని గొడవ పడడంతో టాస్క్ కూడా క్యాన్సిల్ అయ్యేలా చేశాడు బిగ్ బాస్.
అయితే కెప్టెన్సీ పోస్ట్ కోసం అఖిల్, మెహబూబ్ మధ్యలో మాట్లాడడానికి వచ్చింది ఒక్క సోహైల్ మాత్రమే. అతను మెహబూబ్ కోసం త్యాగం చేసి బాగానే సపోర్ట్ చేశాడు గాని అఖిల్ మాత్రం ఒప్పుకోలేదు. మధ్యలో మోనాల్ కూడా చర్చలలో పాల్గొంది గాని వర్కౌట్ కాలేదు. అయితే లాస్య గ్యాంగ్ మాత్రం అందులోకి అస్సలు ఇన్వాల్వ్ కాలేదు. ఎవరిని ఏమన్నా కూడా కష్టమే అంటూ మనకెందుకొచ్చిన గోడవ అని సైలెంట్ గానే ముచ్చట్లు పెట్టుకున్నారు.
ముగ్గురికి కోపం ఎక్కువే అని లాస్య, అభి చాలా కూల్ గా మాట్లాడుకుంటూ మనం మాత్రం అస్సలు వాళ్ళ మధ్యలోకి వెళ్లకూడదు అనేలా మాట్లాడుకున్నారు. అంతా అయిపోయిన తరువాత అభి, లాస్య..మెహబూబ్ కు గీతోపదేశం చేశారు. స్నేహం కోసం త్యాగం చేస్తే నువ్వు హైలెట్ అయ్యేవాడివని అన్నారు. ఆ మాట ముందు చెప్పిన బావుండేదేమో.
బిగ్ బాస్ టాస్క్ క్యాన్సిల్ అయిన తరువాత సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన లాస్య టీమ్ ఎక్కువగా కెప్టెన్సీ విషయంలో ట్రబుల్ అవ్వకుండా తెలివిగా సైలెంట్ అయ్యారు. మరి భవిష్యత్తులో వీరి మధ్యలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందు ఎవరు త్యాగానికి సిద్ధమవుతారో చూడాలి.