Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
బిగ్బాస్ మూడవ వారం నామినేషన్స్: ఏకంగా మంట పెట్టేశాడు.. అమ్మ రాజశేఖర్, దేవి మధ్య మరో చిచ్చు
బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకి మరింత వేడెక్కుతోంది. ఓ వైపు ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల రేటింగ్ తగ్గే అవకాశం ఉందని బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సారి నామినేషన్లు ఎవరు ఊహించని విధంగా జరుగుతున్నాయి. మొదటి రెండు వారాలు నామినేషన్స్ కొంత ఎమోషనల్ గా సెంటిమెంట్స్ తో కొనసాగినప్పటికి ఇప్పుడు మాత్రం చాలా వేడిగా మారాయి. ఏ మాత్రం కనికరం లేకుండా కంటెస్టెంట్స్ వారి కోపాన్ని బయటపెడుతున్నారు.
నామినేషన్స్ ప్రక్రియలో మంట పెట్టిన బిగ్ బాస్
ఇక మూడవ వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఈ సారి బిగ్ బాస్ చాలా డిఫరెంట్ గా ఆలోచించి నామినేషన్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఏకంగా కంటెస్టెంట్స్ ఫొటోలను మంటల్లో వేసి నామినేట్ చేయాలని చెప్పడంతో ప్రతి ఒక్కరిలో ఆగ్రహ జ్వాలలు రేగాయి. కంటెస్టెంట్స్ మధ్య శత్రత్వం డోస్ కూడా పెరిగింది. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముడవవారం నామినేషన్స్ లిస్ట్ ఇదే..
మూడవవరం ఎలిమినేషన్స్ లలో ఉన్న వారి లిస్ట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అరియానా, దేవి నాగవల్లి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్, హారిక నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఎవరికి వారు వారికి నచ్చని కంటెస్టెంట్స్ ఫొటోలను మంటల్లో పడేస్తూ నామినేట్ చేయడం సరికొత్త వివాదాలకు దారి తీసింది.
అభిజిత్ vs సుజాత..
అభిజిత్ ని సుజాత నామినేట్ చేసింది. బహుశా సిస్టర్ అన్నందుకే ఆమె హర్ట్ అయ్యిందేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక అభిజిత్ కూడా ఆమెపైనే అదే తరహాలో రివెంజ్ తీర్చుకున్నాడు. ఒకరినొకరు నామినేట్ చేసుకోవడంతో ఈ వీక్ లో వీరి మధ్య కూడా వివధాలు ఎక్కువయ్యేలా ఉన్నాయని అనిపిస్తోంది.
మంటల్లోకి మోహన్ని పెట్టేసిన మోనాల్
దాదాపు ఈ వీక్ లో ఒకరిపై ఒకరు చాలా పగ పట్టినట్లు నామినేషన్ లో రివెంజ్ తీర్చుకున్నట్లు అర్ధమవుతోంది. సోహైల్, అరియానా మధ్య కూడా మాటల యుద్ధం ఎక్కువవుతోంది. వార్నింగ్ లు కూడా గట్టిగానే ఇచ్చుకున్నారు. ఇక మోనాల్, దివి ఒకరినొకరు. నామినేట్ చేసుకున్నారు. మోనల్ అయితే ఏకంగా మంటల్లోకి మోహన్ని పెట్టేస్తు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video
అమ్మా రాజశేఖర్, దేవి మధ్య మరో చిచ్చు..
ఇక దేవి నాగవల్లి, అమ్మా రాజశేఖర్ ల గొడవ రోజురోజుకి. మరింత ముదురుతోంది. ఒకరి ఫొటోలను మరొకరు మంటల్లో వేస్తూ నామినేట్ టాస్క్ ను పూర్తి చేశారు. అయితే దేవి మాత్రం ఒక పదునైన మాటతో ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. ఐ హోప్.. మన ఇద్దరం కలవాలని కోరుకుంటున్నాం అంటూ అమ్మా రాజశేఖర్ ఫోటోను ఆమె మంటల్లో వేశారు. మరి ఈ నామినేషన్ చిచ్చు కంటెస్టెంట్స్ మధ్య భవిష్యత్తులో ఎలాంటి చిచ్చులను రగిలిస్తుందో చూడాలి.