Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కొంచెం బుర్ర కూడా వాడాలి.. బాడీ ఉంటే సరిపోదు.. మెహబూబ్పై ట్రోల్స్
బిగ్ బాస్ తెలుగు నాల్గో సీజన్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఫిజికల్ టాస్కుల్లో డోసు పెంచాడు బిగ్బాస్. నామినేషన్స్ను కాస్త టైట్ చేశాడు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కూడా ముగించేశాడు. నాల్గో వారం నామినేషన్ కూడా వెరైటీగా పెట్టాడు. మొత్తానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇదంతా కామన్ ప్రతీవారం జరిగేదే. ఇక నిన్న ఇచ్చిన కిల్లింగ్ కాయిన్స్ అనే టాస్క్ హౌస్లో చిచ్చు పెడుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, దూషణలకు దిగుతున్నారు.
కిల్లింగ్ కాయిన్స్..
నాల్గో వారం కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ కిల్లింగ్ కాయిన్స్ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. ఐదుసార్లు బజర్ మోగుతుంటాయి.. అలా మోగిన ప్రతీసారి కాయిన్స్ పడుతుంటాయి. వాటిని సేకరించాలి..భద్రపరుచుకోవాలి..అంటూ బిగ్ బాస్ తెలిపాడు. చివరకు ఎవరి దగ్గర ఎక్కువ విలువ గల కాయిన్స్ ఉంటాయో వారికి ప్రత్యేక సదుపాయాలుంటాయన్నాడు.
సోహెల్ దొంగ అంటూ..
కాయిన్స్ సేకరించే క్రమంలో ఇతరుల వద్ద ఉన్న వాటిని కూడా దొంగిలించే సదుపాయం ఉండటంతో కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. మొదటగా దివి కాయిన్స్ ఎవరో దొంగిలించారు. దీంతో దివి కుమార్ సాయి కాయిన్స్ను దొంగిలించింది. టాస్క్ మధ్యలో ఆరియానా కాయిన్స్ సోహెల్ తీసుకున్నాడంటూ.. ఆయన దగ్గరికి వెళ్లకు దొంగ అంటూ దివి ఆరోపించింది. దీంతో సోహెల్ ఫైర్ అయ్యాడు.
బిగ్బాస్ షాక్..
కాయిన్స్ సేకరించే క్రమంలో అందరూ గ్రూపులు కట్టారు. జంటలుగా ఆట ఆడుతుండటంతో బిగ్ బాస్ ఫైర్ అయ్యాడు. ఎవరి ఆట వారే ఆడాలని హెచ్చరించాడు. దీంతో మళ్లీ అందరూ ఎవరి కాయిన్స్ వారు తమ వద్దే ఉంచుకున్నారు. అయితే నేటి ఎపిసోడ్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరగబోతోన్నాయని తెలుస్తోంది.
వదిలేసిన మెహబూబ్..
అందరూ నిద్రపోయాక కొంత మంది కంటెస్టెంట్లు దొంగతనానికి పూనుకున్నట్టు తెలుస్తోంది. ఎవరి ప్లాన్స్ వారికి ఉండటంతో చోరీలు బాగానే చేస్తున్నారు. అన్నింటికంటే మరీ ఘోరం మెహబూబ్ విషయంలో జరిగింది. ఓ కాయిన్ పట్టుకుని దానికి ఎలాంటి విలువ లేదని వదిలేశాడు. తీరా దాన్ని సుజాత తీసుకుంది. అది స్పెషల్ కాయిన్, స్పెషల్ పవర్ ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించడంతో మెహబూబ్ షాక్ అయ్యాడు.
Recommended Video
మెహబూబ్పై ట్రోల్స్..
బాడీ కాదు బ్రెయిన్ పెట్టి ఆడాలి అంటూ మెహబూబ్ను దారుణంగా ఏకిపారేస్తున్నారు. అసలే ఉక్కు హృదయం టాస్క్లో మెహబూబ్ చేసిన అతిని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ ఇలా దొరికి పోవడంతో అందరూ ట్రోల్ చేస్తున్నారు. మరి ప్రోమోలో అయితే బాగానే ఉంది. పూర్తి ఎపిసోడ్లో ఎవరు బక్రా అవుతారో చూడాలి.