Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ఓట్ల సంఖ్య నిజమేనా?.. నాగార్జున మాటలపై అనుమానం
బిగ్ బాస్ షోకు హైప్ తీసుకొచ్చేందుకు, అది సూపర్ హిట్ అయిందని చెప్పేందుకు నాగార్జున ప్రతీ సారి ఏదో ఒక స్టోరీ చెబుతాడు. ఓట్లు అన్ని కోట్లు వచ్చాయి.. ఇన్ని కోట్లు వచ్చాయని చెబుతుంటాడు. మొదట్లో అయితే టీఆర్పీ రేటింగ్ల గురించి చెప్పేవాడు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తరు. ఎందుకంటే ఈ షోకు టీఆర్పీ లేక మొత్తానికి చతికిలపడిపోయింది. స్టార్ మాలో వచ్చే చిన్న సీరియల్లతో కూడా పోటీ పడలేకపోతోంది. అలాంటి ఈ షో మీద హైప్ పెంచేందుకు నిన్న నాగార్జున రెండు కథలు చెప్పాడు.
ఎప్పటిలాగే ఈ సారి కూడా ఓట్ల విషయాన్ని ప్రస్థావించాడు. ఈ వారంలోనూ ఓట్లు భారీగానే పడ్డాయట. 9.5 కోట్ల ఓట్లు పడ్డాయని నాగార్జున భీరాలు పలికాడు. అసలే ఈ వారం నామినేషన్లో ఉన్నది అఖిల్, అరియానా, అవినాష్, మోనాల్ వంటి కంటెస్టెంట్లు. వీరికే పడి పడి ఓట్లు వేసే అంత సీన్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత వారంలోనూ ఇదే నంబర్ చెప్పిన నాగార్జున.. ఈ వారం కూడా ఇదే నంబర్ చెప్పడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి.,
ఇక ఈ వారంలో అందరికీ కంటే అఖిల్కే ఎక్కువ ఓట్లు పడ్డాయని టాక్. ఆ తరువాత మోనాల్,అరియానా, అవినాష్లకు వచ్చాయని సమాచారం. ఈ ఓట్ల సంగతి కాసేపు పక్కన పెడదాం. నిన్నటి షోలో గుంటూరులో జరిగిందని ఓ ఘటనగురించి చెప్పాడు. ఓ వ్యక్తికి ఆపరేషన్ చేయాలని, ఆ వ్యక్తి కదలకుండా ఉండేందుకు బిగ్ బాస్ షో చూడాలని అడిగాడట. అది బిగ్ బాస్కు ఉన్న క్రేజ్ అంటే ఏదో కాకమ్మ కథలు చెప్పాడని నెటిజన్లు బిగ్ బాస్ షోపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.