Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ ఓట్ల సంఖ్య నిజమేనా?.. నాగార్జున మాటలపై అనుమానం
బిగ్ బాస్ షోకు హైప్ తీసుకొచ్చేందుకు, అది సూపర్ హిట్ అయిందని చెప్పేందుకు నాగార్జున ప్రతీ సారి ఏదో ఒక స్టోరీ చెబుతాడు. ఓట్లు అన్ని కోట్లు వచ్చాయి.. ఇన్ని కోట్లు వచ్చాయని చెబుతుంటాడు. మొదట్లో అయితే టీఆర్పీ రేటింగ్ల గురించి చెప్పేవాడు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తరు. ఎందుకంటే ఈ షోకు టీఆర్పీ లేక మొత్తానికి చతికిలపడిపోయింది. స్టార్ మాలో వచ్చే చిన్న సీరియల్లతో కూడా పోటీ పడలేకపోతోంది. అలాంటి ఈ షో మీద హైప్ పెంచేందుకు నిన్న నాగార్జున రెండు కథలు చెప్పాడు.
ఎప్పటిలాగే ఈ సారి కూడా ఓట్ల విషయాన్ని ప్రస్థావించాడు. ఈ వారంలోనూ ఓట్లు భారీగానే పడ్డాయట. 9.5 కోట్ల ఓట్లు పడ్డాయని నాగార్జున భీరాలు పలికాడు. అసలే ఈ వారం నామినేషన్లో ఉన్నది అఖిల్, అరియానా, అవినాష్, మోనాల్ వంటి కంటెస్టెంట్లు. వీరికే పడి పడి ఓట్లు వేసే అంత సీన్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత వారంలోనూ ఇదే నంబర్ చెప్పిన నాగార్జున.. ఈ వారం కూడా ఇదే నంబర్ చెప్పడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి.,
ఇక ఈ వారంలో అందరికీ కంటే అఖిల్కే ఎక్కువ ఓట్లు పడ్డాయని టాక్. ఆ తరువాత మోనాల్,అరియానా, అవినాష్లకు వచ్చాయని సమాచారం. ఈ ఓట్ల సంగతి కాసేపు పక్కన పెడదాం. నిన్నటి షోలో గుంటూరులో జరిగిందని ఓ ఘటనగురించి చెప్పాడు. ఓ వ్యక్తికి ఆపరేషన్ చేయాలని, ఆ వ్యక్తి కదలకుండా ఉండేందుకు బిగ్ బాస్ షో చూడాలని అడిగాడట. అది బిగ్ బాస్కు ఉన్న క్రేజ్ అంటే ఏదో కాకమ్మ కథలు చెప్పాడని నెటిజన్లు బిగ్ బాస్ షోపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.