Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
Bigg Boss 4 Unseen.. ఆ రెండు గ్రూపులు అలా.. మెనాల్-అఖిల్ ఇలా!!
బిగ్ బాస్ షోలో ఏడో వారం వచ్చే సరికి ఇంట్లో పన్నెండు మంది సభ్యులున్నారు. ఇక వీరిలో ఎవరు ఏ ఏ పనులు చేయాలనే దాంట్లో కాస్త మనస్పర్దలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కరు రెండు రెండు పనులను చేయాలని దివి చెప్పుకొచ్చింది. సరిగ్గా గమనిస్తూ ఇంట్లో గ్రూపులు చాలా బలంగా తయారయ్యాయని కనిపిస్తూనే ఉంటుంది.
గ్రూపులుగా ముచ్చట్లు..
ఏడు వారాలు కలిసే ఉన్నాక గ్రూపులు ఏర్పడటం విశేషమేమీ కాదు. కానీ గత సీజన్లలో మాదిరి వచ్చిన కొత్తల్లోనే బంధాలు, గ్రూపులు పెనవేసుకోలేదు. ఈ సారి కంటెస్టెంట్లు గ్రూపులు కట్టడానికి చాలా టైం పట్టింది. అందులోకొందరు టాస్క్ల వరకు ఆ గ్రూపులను మెయింటేన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది.
ఆ రెండు గ్రూపులు..
బిగ్బాస్ షోలో ప్రస్తుతానికి ఇద్దరిద్దరూ ఓ గ్రూపులుగా ఉన్నారు. అందులో అమ్మ రాజశేఖర్ దివి, అరియానా అవినాష్లు ఓ టీంగా కనిపిస్తుంటారు. హారిక అభిజిత్ నోయల్ ఓ గ్రూపు. ఇందులో లాస్య కూడా కనిపిస్తూ ఉంటుంది. వీళ్లతో తప్పా లాస్య ఇంకెవరితో అంత క్లోజ్గా ఉన్నట్టు కనిపించదు.
కిచెన్ వల్ల గొడవలు..
ఏ ఇంట్లో అయినా వంట దగ్గర గొడవలు వస్తుంటాయి. నాల్గో సీజన్కు వంట లక్కగా మారింది లాస్య. వచ్చినప్పటి నుంచి దాదాపు లాస్య, సుజాత ఇద్దరే వండిపెడుతూ ఉండేవారు. మధ్య మధ్యలో అమ్మ రాజశేఖర్, దివి, మోనాల్ వచ్చేవారు. మాస్టర్ కూడా కిచెన్పై ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నిస్తూనే ఉంటాడు.
దివి ముచ్చట్లు..
అరియానా, అవినాష్, అమ్మ రాజశేఖర్, దివి ముచ్చట్లు పెట్టారు. స్వీపింగ్ నుంచి కిచెన్లోకి వస్తానని మీరంతా ఎందుకు చెప్పలేదని దివి వారిని ప్రశ్నించింది. నేను కిచెన్లోకి మారుతానని చెప్పింది. ఇంట్లో మంది తక్కువగా ఉన్నారు.. రెండు రెండు పనులను చేయాలని దివి చెప్పుకొచ్చింది.
లాస్య అలా..
లాస్య, నోయల్, హారిక, అభిజిత్లు మరో చోట కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు. అవినాష్ తన దగ్గరకు వచ్చి మనమంత స్వీపింగ్ టీం కదా పని ఎప్పుడు మొదలుపెడదామని లాస్యను అడిగాడట. తాను కిచెన్ టీం కదా స్వీపింగ్ ఎందుకు చేస్తానని అవినాష్ను లాస్య ప్రశ్నించిందిట. దివి కిచెన్ టీంలోకి చేంజ్ అవుతోందని అవినాష్ సమాధానమిచ్చాడని లాస్య తెలిపింది. ఇక మోనాల్ అఖిల్ హాల్లో ఉండి ముచ్చటించుకున్నారు. తాను టీం చేంజ్ అయితే పనులు చేయనని, తనకు నచ్చవని, ముందు ఎలా చెప్పాలో అలాగే చేస్తానని అఖిల్ మోనాల్తో చెప్పుకొచ్చాడు.