Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Bigg Boss Elimination: తొలిసారి అలాంటి ఎలిమినేషన్.. డబుల్ అయితే ఆ ఇద్దరు.. సింగిల్ అయితే ట్విస్ట్!
ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. అనూహ్యంగా అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకుని నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్ను అందించారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో 12వ వారానికి సంబంధించి షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలిసింది. ఆ సంగతులు మీకోసం!
చివరి వారాల్లో పెరుగుతోందిగా
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. కానీ, ఆరో సీజన్కు మాత్రం ఆరంభం నుంచి ఆదరణ అంతంత మాత్రంగానే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిది చివరి దశలో ఉండడంతో రంజుగా మారింది. ఫలితంగా కొత్త ట్విస్టులతో మజాను పంచుతోంది. దీంతో ఈ సీజన్కు రేటింగ్ కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
బోల్డు షోలో హద్దు దాటిన పాయల్: కాలు పైకి లేపి.. అలా సైగలు చేస్తూ!
ఈ వారం వాళ్లంతా నామినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్లోని పన్నెండో వారం నామినేషన్స్ టాస్కు కన్ఫెషన్ రూమ్లో సీక్రెట్గా నిర్వహించారు. ఇక, ఈ వారానికి జరిగిన టాస్క్లో ఇనాయా సుల్తానా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీహాన్ చోటూ, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్లో ఉన్నారు. ఇక, ఈ వారం కెప్టెన్ అవడం వల్ల రేవంత్ సేఫ్ అవగా.. నామినేట్ చేయని కారణంగా కీర్తి భట్ కూడా తప్పించుకుంది.
ట్విస్టులతో ముగిసిన ఓటింగ్
ఆరో సీజన్ చివరి దశకు చేరడంతో ఇప్పటి నుంచి అన్ని ఎలిమినేషన్స్ ఎంతో ఆసక్తికరంగా మారబోతున్నాయి. దీంతో తమకు నచ్చిన కంటెస్టెంట్లను కాపాడుకోవడం కోసం ప్రేక్షకులు పోటీపోటీగా ఓట్లు వేస్తున్నారు. ఫలితంగా పన్నెండో వారం ఓటింగ్లో ఎన్నో ట్విస్టులు కనిపించాయి. దీంతో కంటెస్టెంట్ల పోలింగ్ స్థానాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
పబ్లిక్లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్గా!
ఆ ఒక్కరికే 25 శాతం పోలింగ్
బిగ్ బాస్ ఆరో సీజన్లో రేవంత్ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగాడు. కానీ, అతడి ప్రవర్తనతో విమర్శలను ఎదుర్కోంటోన్నాడు. అదే సమయంలో చక్కని ఆటతీరుతో ఇనాయా సుల్తానా బాగా మెప్పిస్తోంది. దీంతో ఆమె ఎంతో పోటీ ఇస్తోంది. ఇక, ఈ వారంలో రేవంత్ లేకపోవడంతో ఇనాయాకు దాదాపు 25 శాతం ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆమె టాప్ ప్లేస్లో ఉందట.
ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?
ఆరో సీజన్ పన్నెండో వారానికి జరిగిన ఓటింగ్లో ఇనాయా సుల్తానా మొదటి స్థానంలోనే ఉందని తెలిసింది. ఆమె తర్వాత అంటే రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో శ్రీ సత్య, ఐదో స్థానంలో రోహిత్ ఉన్నారని తెలిసింది. అయితే, మిస్స్డ్ కాల్స్ ద్వారా మాత్రం రోహిత్ నాలుగో స్థానంలో, శ్రీ సత్య ఆరో స్థానంలో ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.
Bigg Boss: ఫ్యామిలీ ఎపిసోడ్లో రేవంత్కు షాక్.. కనికరించని బిగ్ బాస్.. ఆమె కోసం పెద్ద త్యాగం
నలుగురూ డేంజర్ జోన్లోనే
బిగ్ బాస్ ఆరో సీజన్ పన్నెండో వారానికి సంబంధించిన ఓటింగ్లో ప్రస్తుతం రాజశేఖర్ ఆరో స్థానంలో, ఏడో స్థానంలో ఫైమా ఉన్నట్లు తెలిసింది. వీళ్లతో పాటు శ్రీ సత్య, రోహిత్ కూడా ఈ వారానికి డేంజర్ జోన్లోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వీళ్ల ఓటింగ్లో తేడా చాలా తక్కువగా ఉండడమేనట. అంటే ఈ నలుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
డబులైతే ఇలా.. సింగిలైతే అలా
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే, ఎలిమినేషన్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే శ్రీ సత్య, రాజ్, రోహిత్లలో ఒకరు వెళ్తారు. ఫైమా పాస్ వాడుకుంటే ఆమె ఉంటుంది. లేకపోతే వాళ్లతో పాటు వెళ్లిపోతుంది. అలాగే, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫైమా పాస్ వాడితే ఉంటుంది. లేకపోతే ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సీజన్లో తొలిసారి సెన్సేషనల్ వీక్ కాబోతుంది.