బిగ్ బాస్ బ్యూటీకి ప్రమాదం.. జీవితమంటేనే సవాళ్లు అంటూ పోస్ట్
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షోతో ఎంతోమంది కళాకారులకు, నటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ఓ వేదికగా మారింది. అలా బిగ్ బాస్ వేదిక ద్వారా క్రేజీ పాపులారిటీని సంపాదించుకున్న నటులల్లో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ దివి ఒకరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ను తన గ్లామర్ షో తో అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఓ షాకింగ్ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి ? ఆమెకు ఏమైంది?
బిగ్ బాస్ బ్యూటీ దివి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బిగ్ బాస్ 4 షో తో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత మహర్షి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది బ్యూటీ. తన అందాల ఆరబోతతో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ బ్యూటీ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది. దీంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మడు అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది.

కేవలం సినిమాలలోని కాకుండా వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోలు నటిస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది బిగ్ బాస్ బ్యూటీ దివి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ తన అందాల ను ఆరబోస్తూ ఉంటుంది. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ తన అభిమానుల మనసును దోచుకుంటుంది. తన గ్లామర్ షో తోనిత్యం ఏదోక అప్డేట్స్ ఇచ్చే ఈ అమ్మడు తాజాగా ఓ షాకింగ్ ఫోటోను నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది ఇంతకీ ఆ అమ్మడు పెట్టిన పోస్ట్ ఏంటి? అసలు బిగ్బాస్ బ్యూటీ కి ఏమైంది?
బిగ్ బాస్ బ్యూటీ టివి తన కాలికి పెద్ద కట్టు కట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోను బట్టి చూస్తే కాలికి ఏదో పెద్ద గాయమే అయినట్లు తెలుస్తోంది. ఆమె కాలికి పాస్టర్ ఆఫ్ పారిస్ తో కూడిన కట్టు వేసినట్లు అర్థమవుతుంది. అయితే ఆమెకు ప్రమాదం షూటింగ్లో జరిగిందా? మరి ఎక్కడైనా జరిగిందా? అనే విషయం మాత్రం తెలియ రాలేదు. కాలికి కట్టిన ఆకట్టుపై కొన్ని బొమ్మలు కొన్ని రాతలు రాసినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో నటి దివి షేర్ చేస్తూ.. ఇలా రాస్కొచ్చింది.
'కొన్నిసార్లు మన పనులను ఇలాంటి గాయాలు ఆపుతాయి కావచ్చు. కానీ, ఎంటర్టైన్మెంట్ ని ఎందుకు ఆపాలి. అందుకే ఈ కట్టుని నాకు అద్దంకి అని నేను భావించకుండా బొమ్మలు గీస్తూ అందంగా తయారు చేశాను. జీవితం అంటే కష్టాలను తప్పించుకోవడమే కాదు.. ఇలాంటి సమయాలలో కూడా నవ్వుతూ ఉంటాయి. అందుకే నేను ఇలా చేస్తున్న నా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతిదానిలో ఆనందాన్ని నేను వెతుక్కుంటాను' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తమ ఫేవరెట్ బ్యూటీ కి ఏం జరిగిందో? అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు ఆమెకేమైంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











