Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Non Stop: ఎలిమినేషన్స్ లో మరో కొత్త అనుమానాలు.. ఇలా కూడా ఆలోచిస్తారా?
బిగ్ బాస్ తెలుగు షో మొదలైనప్పుడు అంతగా సక్సెస్ కాదు అని చాలామంది కామెంట్ చేశారు. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జూనియర్ ఎన్టీఆర్ తో మొదలు పెట్టి ఇప్పుడు నాగార్జున తో కూడా అదే రేంజ్ లో ముందుకి సాగుతున్నారు ల్. నెగటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నా కూడా షోను అదే తరహాలో కొనసాగిస్తూ మంచి ఆదాయం అందుకుంటున్నారు.
అయితే అప్పుడప్పుడు నెటిజన్లకు చిరాకు తెప్పించే కొన్ని అనుమానాలు కూడా బిగ్ బాస్ పై వస్తున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో అయితే బిగ్ బాస్ సమన్యాయం పాటించడం లేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓట్ కంటెంట్ నాన్ స్టాప్ షోలో ఎలివేషన్స్ పై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎలిమినేషన్స్ లో ఇలా కూడా ఆలోచిస్తారు అనే సందేహాలు కలుగుతున్నాయి.
సమన్యాయం జరగడంలేదని..
బిగ్ బాస్ మొదటి సీజన్లో ఎలిమినేషన్స్ అన్ని కూడా చాలా వరకు న్యాయంగానే జరిగినట్లు ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన సెకండ్ సీజన్ పై కూడా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ మూడవ సీజన్ నాగార్జున మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఎలిమినేషన్స్ విషయంలో సమన్యాయం జరగడంలేదని ఓ వర్గం ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఎంట్రీ ఇచ్చినప్పుడే..
బిగ్ బాస్ నాన్ స్టాప్ విషయంలో మొదటి నుంచి కూడా ఓ వర్గం ప్రేక్షకులు నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే అన్ని వర్గాల వారు పూర్తి స్థాయిలో సంతృప్తి పొందలేక పోయారు. మళ్ళీ పాతవారిని ఇంకా ఎందుకు తీసుకు వచ్చారు అనే కామెంట్స్ కూడా చాలానే వినిపిస్తున్నాయి.
వాళ్ళు వెళ్లిపోవాల్సింది..
దానికి తోడు రొటీన్ గా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుని కంటెస్టెంట్స్ ను హౌస్ లో ఉంచి.. మంచి గుర్తింపును అందుకున్న వారిని బయటకు పంపిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని మరికొందరి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు వెళ్ళిపోయినా వారిలో న్యాయం లేదని వాళ్ల కంటే కూడా ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారు కొందరు బయటకు వెళ్లి పోవాల్సింది అని కూడా అంటున్నారు.
సేఫ్ గేమ్
ముఖ్యంగా ఆర్జే చైతూ సరయు తేజస్వి మదివాడ ఈ ముగ్గురు కూడా బయటకు వెళ్లి పోయే కంటెస్టెంట్స్ అయితే కాదు అని వీరికంటే చాలా బలహీనంగా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది ఉన్నారు అని అసలు వారు సరిగా గేమ్ ఆడటం లేదు అని సేఫ్ గామ్ కొనసాగుతున్నట్లు గా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమానాలు
అయితే మొదట ముమైత్ ఖాన్ వెళ్లిపోయిన తర్వాత గత వారం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరయి కూడా వెళ్ళిపోయే కంటెస్టెంట్ అయితే కాదు. అనంతరం తేజస్వి మదివాడ ఇలా ప్రముఖ సెలబ్రిటీ లో నుంచి బయటకు వెళ్లిపోవడం పలు అనుమానాలకు కలగజేసింది
కారణం అదేనా?
బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఓట్ల పరంగానే కంటెస్టెంట్స్ ను ఎలివేటీజ్ నిర్వహిస్తున్నట్లు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు హౌస్ లో నుంచి వెళ్ళిపోయినా వారికి ప్రస్తుతం హౌస్లో ఉన్న వారి కంటే ఎక్కువ స్థాయిలోనే పారితోషికాలు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే షో కి మంచి బజ్ అయితే ఏర్పడుతుంది.
ఈ తరుణంలో రెమ్యునరేషన్ అనుకున్నంత రేంజ్ లో దక్క పోయినప్పటికీ కూడా కొంతమంది కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు అని వారికే బిగ్బాస్ మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఫైనల్గా బిగ్ బాస్ ఆదాయం గురించి కూడా ఆలోచించి ఎలిమినేషన్స్ ను ముందుకు కొనసాగిస్తున్నారుని టాక్. మరి నెక్స్ట్ ఎలిమినేట్ లో ఉంటారు చూడాలి