Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Bigg Boss Grand finale updates: కౌశల్ మండా రికార్డును బ్రేక్ చేసిన అభిజిత్.. ఆ ముగ్గురు ఫైనల్కు డుమ్మా!
బిగ్బాస్ తెలుగు 4 ఫైనల్కు సంబంధించిన షూట్ మొదలైంది. హోస్ట్ నాగార్జున వేదిక మీదకు రావడంతో బిగ్బాస్ వేదిక వద్ద హంగామా మొదలైనట్టు సమాచారం. ఇంటి సభ్యులతోపాటు ఎలిమినేట్ అయిన సభ్యులు కూడా ఇంటిలోకి వెళ్లారు. ఈ క్రమంలో బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన వివరాలకు వస్తే..
ఇంటి సభ్యులతో హోస్ట్ నాగార్జున
శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులతో నాగార్జున మాట్లాడటం మొదలుపెట్టినట్టు సమాచారం. ఇక ఇంటి సభ్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా ఇంటిలోని టాప్ 5 కంటెస్టెంట్లతో కలిసి ముచ్చటించే విధంగా షూట్ను డిజైన్ చేసినట్టు తెలిసింది.
అభిజిత్కు 70 శాతం ఓట్లు
తాజాగా ఓటింగ్ వివరాల ప్రకారం.. చివరి వారంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో అభిజిత్ అత్యధికంగా రికార్డు స్థాయిలో ఓట్లు రాబట్టినట్టు సమాచారం. 14వ వారంలో పోలైన ఓట్లలో అభిజిత్కు 70 శాతం ఓట్లు వచ్చాయనే విషయం తెలిసింది. భారీ స్థాయిలో ఓట్లు రాబట్టడంతో అభిజిత్ విజేతగా నిలిచే అవకాశం ఉంది.
కౌశల్ మండా రికార్డు బ్రేక్
గత సీజన్లతో పోల్చుకొంటే అభిజిత్కు అత్యధికంగా ఓట్లు రావడంతో అనేక రికార్డులు బ్రేక్ అయ్యాయనేది సమాచారం. సీజన్ 3లో విజేతగా నిలిచిన కౌశల్ మండా కంటే ఎక్కువ ఓట్లను అభిజిత్ సంపాదించి సరికొత్త రికార్డును నమోదు చేసినట్టు తెలుస్తున్నది. అభిజిత్కు రికార్డు స్థాయి ఓట్లను వేసిన అభిమానులు అభిజిత్ ఆర్మీ సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెబుతున్నారు.
ఆ ముగ్గురు ఫైనల్ వేడుకలకు దూరం
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లను పిలవడం ఆనవాయితీ. అయితే ఈ ఫినాలేకు దేవీ నాగవల్లి, దర్శకులు సూర్య కిరణ్, అమ్మా రాజశేఖర్ దూరంగా ఉన్నట్టు సమాచారం. తనకు అన్యాయం జరిగిందనే విషయంపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన దేవీ నాగవళ్లి ఉద్దేశపూర్వకంగానే ముగింపు వేడుకకు గైర్హాజరు అయినట్టు సమాచారం.