Don't Miss!
- Finance Patanjali Share: బాబా రామ్దేవ్ కంపెనీకి విదేశీ ఇన్వెస్టర్లు.. కోర్టు మెుట్టికాయల తర్వాత..
- News బెంగళూరు ఎయిర్ పోర్టులో యూట్యూబర్ ఏం చేశాడంటే ?, వైరల్ వీడియోతో చిక్కిపోయాడు !
- Technology Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- Sports IPL 2024: రియాన్ పరాగ్కు బీసీసీఐ ప్రమోషన్..!
- Lifestyle అందుకే కవలలు పుడతారు.. ఈ రహస్యం తెలియని వారు చాలా తక్కువ..
- Automobiles సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
- Travel ఇండియాలోని సమ్మర్లో వెళ్లకూడని సందర్శనీయ ప్రదేశాలివే!
Big boss Telugu 5: వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన బిగ్ బాస్.. క్వారంటైన్ లో ఇద్దరు స్టార్స్?
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన విధానం బాగానే ఉన్నప్పటికీ కంటెస్టెంట్స్ లో విషయంలో మాత్రం అభిమానులు కాస్త అసంతృప్తితోనే ఉన్నారు అని చెప్పాలి. గత ఏడాదిలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో స్టార్ సెలబ్రిటీలను ఇంట్లోకి వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే బిగ్ బాస్ నిర్వాహకులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు అనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. ఇక ఈ సారి కూడా అంతకుమించి అనిల కొంతమంది మీడియం రేంజ్ సెలబ్రిటీలను కూడా హౌస్ లోకి తీసుకు వస్తారని అందరూ అనుకున్నారు.
కానీ ఈసారి కూడా బిగ్ బాస్ ఆ విషయం లో అప్సెట్ చేసింది అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. అయితే అలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా కూడా బిగ్ బాస్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. తెలివిగా కంటెస్టెంట్స్ ను ఆడిస్తున్న బిగ్ బాస్ భారీ స్థాయిలో అందుకుంటున్నాడు. ఇక అసలైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోను మరొక లెవెల్ కి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు.
అందరికి నచ్చేలా
బిగ్ బాస్ అనేది టెలివిజన్ రంగంలో టాప్ షోగా కొనసాగుతోంది కాబట్టి ఎక్కువగా రెగ్యులర్ ప్రేక్షకులకు నచ్చేలా అదే ఫీల్డ్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను తీసుకోవాలని అనుకున్నారు. అందుకే టెలివిజన్ రంగంలో మంచి సెలబ్రిటీల గా గుర్తింపు అందుకున్న వారి పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఎప్పటిలానే లీక్ అవుతున్నాయి
బిగ్ బాస్ హౌస్ లో ప్రతి నిత్యం కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేది మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కొంతమంది పేర్లు అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రతి సారి కూడా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వారి పేర్లు ముందుగానే లీక్ అవుతూ వస్తున్నాయి. కంటెస్టెంట్స్ లిస్టు ఎలాగైతే బయటకు లీక్ అవుతుందో అదే తరహాలో ఆ తర్వాత వచ్చే వారి పేర్లు కూడా ఈజిగానే బయటకు వస్తున్నాయి.
నవ్య స్వామి, యాంకర్ వర్ష
బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో ఎంత రహస్యంగా ఉండాలని అనుకున్నా కూడా వర్కౌట్ అవ్వడం లేదు. ఎవరో ఒకరి వల్ల ఆ పేర్లు అయితే చాలా ఈజీగానే బయటకు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇద్దరి పేర్లు అయితే హాట్ టాపిక్ గా మారాయి. 'ఆమె కథ' సీరియల్ ఫేమ్ అయినటువంటి నవ్య స్వామి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా ఒక టాక్ అయితే వస్తోంది. అలాగే బుల్లితెర గ్లామరస్ యాంకర్ యాంకర్ వర్ష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Recommended Video
టాస్క్ లోనే వైల్డ్ ఎంట్రీ?
బిగ్ బాస్ మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఈ ఇద్దరు ప్రముఖ తారలను ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు కూడా క్వారంటైన్ లోనే ఉన్నట్లు సమాచారం. ముందుగానే బిగ్ బాస్ నిర్వాహకులు కరోనా పరీక్షలు నిర్వహించి ఇద్దరిని ఒక స్టార్ హోటల్లో ఉంచినట్లు తెలుస్తోంది.
ఇక త్వరలోనే ఒక ప్రత్యేకమైన టాస్క్ లో వీరిద్దరిని రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం రెండవ వారం కూడా మంచి రేటింగ్ తో కొనసాగుతున్న బిగ్ బాద్ సీజన్ 5 మూడో వారంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ వారం హౌస్ లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది.