Don't Miss!
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Bigg Boss Winner: 4వ రోజు ఒక్కసారిగా మారిన పోలింగ్.. అతడికి భారీగా ఓటింగ్.. టాప్ ప్లేయర్కు షాక్!
ఐదేళ్ల క్రితం తెలుగులోకి పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులను గెలుచుకున్న ఏకైక షో బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఆడియెన్స్ దీనికి జై కొట్టారు. ఫలితంగా సీజన్ల మీద సీజన్లు పూర్తవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఆఖరి వారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇక, ఈ టైటిల్ పోరులో ఐదుగురు కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. గత ఆదివారం నుంచే ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు ఎవరికి నచ్చిన కంటెస్టెంట్కు వాళ్లు ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు ఓటింగ్ ఒక్కసారిగా మారినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!
Recommended Video
ఇప్పటి వరకూ వాళ్లంతా ఎలిమినేట్
ఎన్నో అంచనాలతో మొదలైన ఐదో సీజన్కు 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారం ప్రియాంక సింగ్, పద్నాలుగో వారం కాజల్లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారం హెల్త్ బాలేక వచ్చేశాడు.
టైటిల్ బరిలో నిలిచిన కంటెస్టెంట్లు
బిగ్ బాస్ ఐదో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే అంటే వచ్చే ఆదివారమే ఈ సీజన్కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఇందులో విజయం సాధించేందుకు మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీళ్ల ఐదుగురి మధ్య పోరు ఆసక్తికరంగా సాగబోతుంది. దీంతో వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ ఈ వారం మొత్తం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమకు నచ్చిన వాళ్లను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Bigg Boss Winner: 3వ రోజు ఓటింగ్లో ట్విస్ట్.. హాట్స్టార్లో ఒకరు.. మిస్డ్ కాల్స్లో మరొకరు టాప్
విజేతగా నిలిచేది వాళ్లిద్దరిలోనేనని
భారీ అంచనాలతో మొదలైన ఐదో సీజన్లో చాలా మంది టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అయితే, అందులో చాలా మంది మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఇప్పుడున్న ఐదుగురూ తమ తమ సత్తాను నిరూపించుకుని ఫినాలే వరకూ చేరుకున్నారు. ఇక, టాప్ 5లో నిలిచిన ఈ ఐదుగురిలో టైటిల్ పోటీ మాత్రం వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మధ్యనే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరికి మాత్రమే ఆరంభం నుంచే ఎక్కువ ఆదరణ దక్కుతూ వస్తోంది. వీళ్లిద్దరి అభిమానులు పోటాపోటీగా ఓట్లు వేస్తున్నారు.
మొదటి నుంచీ అతడిదే టాప్ ప్లేస్
ఈ సీజన్లో ఫినాలేకు చేరిన వారిలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఆసక్తికరంగా సాగబోతుంది. ఆదివారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడంతో బుల్లితెర ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకుంటున్నారు. ఇక, ఈ వారం మొదటి నుంచే వీజే సన్నీ ఓటింగ్లో మొదటి స్థానంలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అనాధికారిక ఓటింగ్లో సైతం అతడే హవాను చూపిస్తున్నాడు. దీంతో మరో టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానానికే పరిమితం అయ్యాడని అంటున్నారు.
సినీ ప్రియులకు ఊహించని ట్రీట్: బాలకృష్ణతో రాజమౌళి.. స్టార్ ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్
వాళ్ల స్థానాల్లో మాత్రం మార్పు లేదు
వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ను మినహాయిస్తే.. ఇప్పుడు టాప్ 5కు చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్లలో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే శ్రీరామ చంద్ర అనే చెప్పాలి. టికెట్ టు ఫినాలే గెలుచుకుని అందరి కంటే ముందే ఫైనల్స్లో అడుగు పెట్టాడతను. ఇక, మొదటి రోజు ఓటింగ్లో శ్రీరామ్ మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. అలాగే, వివాదాలకు దూరంగా ఉంటూ ప్రతి టాస్కులో మెప్పించిన మానస్ మాత్రం నాలుగో స్థానంలో ఉన్నాడట. ఇక, ఆడవాళ్లందరినీ దాటుకుంటూ ఫినాలేలో అడుగు పెట్టిన సిరి హన్మంత్ ఐదో స్థానంలో కొనసాగుతుందని టాక్.
నాలుగో రోజు మారిపోయిన ఓటింగ్
టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లలో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రియులు, కంటెస్టెంట్ల అభిమానులు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో ఈ సారి కూడా భారీ స్థాయిలో ఓటింగ్ జరుగుతున్నట్లు బుల్లితెర వర్గాల సమాచారం. ఇక, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. నాలుగో రోజైన బుధవారం పోలింగ్ ఒక్కసారిగా మారిందని అంటున్నారు. దీని ప్రకారం.. షణ్ముఖ్ జస్వంత్కు నిన్న భారీగా ఓటింగ్ జరిగిందట. హాట్స్టార్లోనే కాదు.. మిస్డ్ కాల్స్లో కూడా అతడికి భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యాయని సమాచారం.
Pushpa Business: షాకిస్తోన్న పుష్ప బిజినెస్.. బాహుబలిని దాటేసి రికార్డు.. అన్ని కోట్లు వస్తేనే హిట్
టాప్లో ఉన్న కంటెస్టెంట్కు షాక్
ఆదివారం
నుంచి
మొదలుకొని
ప్రతిరోజూ
ఒకే
రకమైన
ఓటింగ్
జరుగుతూ
వచ్చింది.
దీంతో
ఆరంభం
నుంచే
వీజే
సన్నీ
మొదటి
స్థానంలో,
షణ్ముఖ్
జస్వంత్
రెండో
స్థానంలో,
శ్రీరామ
చంద్ర,
మానస్,
సిరి
హన్మంత్లు
తర్వాతి
స్థానాల్లో
కొనసాగుతున్నారు.
దీంతో
ఈ
సీజన్కు
సన్నీనే
విజేత
అని
అందరూ
డిసైడ్
అయిపోయారు.
కానీ,
బుధవారం
షన్నూకు
ఓటింగ్
పెరిగిందని
తెలిసింది.
దీంతో
టాప్
ప్లేస్కు
అతడు
కూడా
చేరుకునే
అవకాశాలు
ఉన్నాయనే
టాక్
వినిపిస్తోంది.
ఇదే
జరిగితే
మొదటి
స్థానంలో
ఉన్న
సన్నీకి
భారీ
షాక్
తప్పదు
అనే
చెప్పుకోవాలి.