Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Bigg Boss Telugu 6 రేవంత్-శ్రీసత్య మాటల యుద్ధం.. అబ్బాయిలు అమ్మాయిలు అంటూ గొడవ!
తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్తో సంచలనాలను సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎవరూ ఊహించని కంటెంట్తో సాగే దీనికి ప్రేక్షకుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన లభించింది. దీంతో తెలుగులో వరుసగా సీజన్లను పూర్తి చేసకుంటూ వస్తోంది రియాలిటీ షో బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ ప్రారంభమై సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇంకొన్ని రోజుల్లో 6వ సీజన్ కూడా పూర్తి కానుంది. అయితే ఇప్పుడు హౌజ్ లో తగ్గించిన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి తెచ్చుకునేందుకు టాస్క్ లు నడుస్తున్నాయి. దీనికి సంబంధించిన డిసెంబర్ 6 మంగళవారం నాటి ఎపిసోడ్ రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
నామినేషన్లలో ఆరుగురు..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం ఏడుగురు మిగిలారు. అయితే ఈ 14వ వారం నామినేషన్ల ప్రక్రియ జరగలేదు. ఇంటి సభ్యులను నేరుగా బిగ్ బాస్ నామినేట్ చేశాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిచి ఫినాలేకు వెళ్లిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీహాన్ నిలిచాడు. దీంతో అతను నామినేట్ కాలేదు. అతను తప్పా మిగతా ఇంటి సభ్యులందరిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అంటే ఈ 14వ వారం నామినేషన్లలో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, శ్రీసత్య, కీర్తి భట్ ఆరుగురు ఉన్నారు.
టాస్కుల్లో పోగొట్టుకున్న డబ్బెంతంటే..
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఇదివరకు టాస్కుల రూపంలో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని తొలగించిన విషయం తెలిసిందే. ఆ డబ్బు సుమారు రూ. 12 లక్షలుగా ఉన్నట్లు గత ఎపిసోడ్ లో బిగ్ బాస్ తెలిపాడు. అయితే ఆ డబ్బును మళ్లీ తిరిగి పొందేందుకు ఇంటి సభ్యులచేత టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్. మొదటి రెండు ఛాలెంజ్ ల్లో రోహిత్, శ్రీసత్య, రేవంత్, ఇనయా పాల్గొన్నారు.
మాట మార్చకు రేవంత్..
ఇంటి సభ్యులకు మూడో ఛాలెంజ్ ను బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన 93వ రోజు 94వ ఎపిసోడ్ రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమోలో ఏకాభిప్రాయమనేది తర్వాత అమౌంట్ లో (ఛాలేంజ్) చూద్దామని రేవంత్ అన్నాడు. దీంతో మాట మార్చకు.. ఇప్పుడు జరిగేదాంట్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వెళ్తారని అన్నావ్ కదా అని శ్రీసత్య అంది. ఒక ఎంటైర్ టాస్క్ వరకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అని చెప్పానా అని అడిగాడు రేవంత్.
ఆలోచించే శక్తి లేదా.. యాటిట్యూడా..
రేవంత్ అన్నదానికి నువ్ ఫస్ట్ 3 రౌండ్స్ అని మెన్షన్ చేశావా అని అడిగింది శ్రీసత్య. నువ్ అనుకో, ఏమో నేనైతే ఒప్పుకోను అని రేవంత్ అంటే.. ప్రతీసారి అబ్బాయిలు అబ్బాయిలే ఆడుకుంటే మేమెందుకు.. మీరే ఆడుకోండి గేమ్స్ అన్ని, అమ్మాయిలు ఆడరు అని శ్రీసత్య అంది. ఎక్కడి నుంచి ఎక్కడికీ తీసుకెళ్తుందో.. మీకు ఆలోచించే శక్తి లేదా, లేకపోతే అది వినడానికి యాటిట్యూడా నాకు అర్థం కాదు అని రేవంత్ అన్నాడు.
మనీ ట్రాన్స్ ఫర్ ఛాలెంజ్..
తర్వాత అబ్బాయులు ఎంతమంది ఉన్నారు, అమ్మాయులు ఎంతమంది ఉన్నారని రేవంత్ అడిగితే.. అబ్బాయిలు 4, అమ్మాయిలు 3 మంది అని చెప్పింది శ్రీసత్య. దీంతో మరి అది గేమ్ ఆడటం ఎలా అవుతుందని రేవంత్ అంటే.. ఎందుకవ్వదు అని శ్రీసత్య అంది. ఈ గొడవ తర్వాత విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించుకోవడానికి బిగ్ బాస్ ఇప్పుడు ఇస్తున్న ఛాలేంజ్ మనీ ట్రాన్స్ ఫర్ అని ఇనయా చెప్పింది.
రెండు బృందాలుగా ఏర్పడి..
మూడో ఛాలెంజ్ లో రెండు బృందాలుగా ఏర్పడి ఇంటి సభ్యులు గేమ్ ఆడారు. శ్రీసత్య, శ్రీహాన్ ఒక టీమ్ కాగా, ఆదిరెడ్డి, కీర్తి భట్ మరొ బృందంగా ఉన్నారు. ఒక టీమ్ సభ్యులు కలిసి మనీ రాసిన కార్డ్స్ ను స్టిక్స్ ద్వారా పట్టుకుని పక్కనున్న బాస్కెట్ లో వేయాలి. రెండు టీమ్స్ ఆ కార్డ్స్ ను స్టిక్స్ ద్వారా పట్టుకొచ్చి బాస్కెట్ లో వేసేందుకు బాగానే ప్రయత్నించారు. కానీ బాస్కేట్ దగ్గరికి వచ్చేసరికి కింద పడిపోతున్నాయి. అయితే ఈ టాస్క్ లో ఎవరు గెలిచి, డబ్బు ఎంత రాబట్టుకున్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.