Don't Miss!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
Bigg Boss Finale Winner బెస్ట్ ఫ్రెండ్స్ రేవంత్-శ్రీహాన్ మధ్య పోటీ.. నేరుగా ఫినాలేకు వెళ్లింది ఎవరంటే?
బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తొలుత హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమై భారీగా ప్రేక్షకాదరణ పొందింది. వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో నడుస్తోంది. ఈ సీజన్ కూడా దాదాపుగా పూర్తి దశకు చేరింది. ఇప్పటికీ 88 రోజులు 89 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇంటి సభ్యులు నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారన్న వివరాల్లోకి వెళితే..
జోరుగా నామినేషన్లు..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం మిగిలిన 8 మందికి 13వవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడీ వేడిగా సాగింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరంత ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నారు. ఇక ఇటీవల వీళ్లకు నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
మూడు రోజులుగా ఫినాలే టాస్క్..
గత మూడు రోజులుగా ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో భాగంగా ముందుగా 8 మంది కంటెస్టెంట్స్ కు స్నో మ్యాన్ గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో స్నో మ్యాన్ పార్ట్స్ కలెక్ట్ చేసి స్నో మ్యాన్ ను కట్టాలి. అయితే ఈ టాస్క్ లో ముందుగా శ్రీసత్య డిస్ క్వాలిఫై అయిపోయింది. ఆ తర్వాత రెండో రౌండ్ ప్రారంభించారు. ఈ రౌండ్ లో ఇతర సభ్యులపై అటాక్ చేసి వాళ్ల స్నో మ్యాన్ పార్ట్స్ ను లాక్కోవ్వచ్చు.
ఫినాలే టాస్క్ లో పాల్గొనేందుకు..
స్నో మ్యాన్ రెండో రౌండ్ లో శ్రీహాన్ స్నో మ్యాన్ పార్ట్స్ లాక్కునేందుకు ఇనయా సుల్తానా ట్రై చేసింది. కానీ అది అటాకింగ్ లా కాకుండా ఇద్దరి మధ్య రొమాన్స్ లా అనిపించింది. దీనిపై ఇంటి సభ్యులు కామెంట్స్ కూడా చేశారు. రెండో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి తక్కువ స్నో మ్యాన్ ఉండటంతో ఇనయా ఔట్ అయింది. అనంతరం కీర్తి తొలిగిపోయింది. అయితే ఫినాలే టాస్క్ లోకి వచ్చేందుకు ఇనయా, శ్రీసత్య, కీర్తికి ఒక టాస్క్ ఇచ్చారు.
చివరి రెండు స్థానాల్లో..
టికెట్ టు ఫినాలే టాస్క్ లోకి మరోసారి వచ్చేందుకు ఇచ్చిన కలర్ టాస్క్ లో కీర్తి గెలిచింది. దీంతో ఆమె మరోసారి ఫినాలే టాస్క్ లో పాల్గొనే అవకాసం దక్కించుకుంది. తర్వాత కంటెస్టెంట్స్ కి బాల్ టాస్క్ ఇచ్చారు. ఇలా ఫినాలే టాస్క్ ను కొనసాగించారు. అప్పుడే టాస్క్ లో పాయింట్స్ పెట్టారు. దీంతో చివరి రెండు స్థానాల్లో కీర్తి, రోహిత్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏకాభిప్రాయమనే చర్చను ప్రతిసారి ప్రదిపాదించారు బిగ్ బాస్. దీంతో అప్పుడు కీర్తి, రోహిత్ ను తీసేస్తున్నట్లు ఇనయా, శ్రీసత్య తెలిపారు.
తప్పుకున్న ఆదిరెడ్డి, రేవంత్..
కీర్తిని, రోహిత్ ను తొలగించడంతో ఇనయా, శ్రీసత్యతో కీర్తి గొడవకు దిగింది. కానీ వాళ్ల నిర్ణయాన్ని అర్థం చేసుకున్న రోహిత్ అంగీకరించాడు. అయితే చివర్లో అందరూ ఫినాలే రేస్ లో ఉన్నారని బిగ్ బాస్ తెలిపాడు. గత ఎపిసోడ్ లో ఏకాభిప్రాయంలో భాగంగా ఆదిరెడ్డి, రేవంత్ తప్పుకోగా.. శ్రీహాన్, కీర్తి, రోహిత్, ఫైమా రోల్ బేబీ రోల్ గేమ్ ఆడారు. ఇందులో శ్రీహాన్ ఫస్ట్, రోహిత్ సెకండ్ వచ్చారు.
రోల్ బేబీ రోల్ టాస్క్..
రోల్ బేబీ రోల్ టాస్క్ లో పడుకుని జారుకుంటూ టవర్ బిల్డ్ చేయాలి. అయితే బజర్ మోగిన తర్వాత కూడా కీర్తి, రోహిత్ పెట్టారని సంచాలక్ లు అయిన శ్రీసత్య, ఇనయా అన్నారు. కానీ బజర్ తర్వాత బ్రిక్ తీసేసిన రోహిత్ టవర్ సరిగ్గా, హైట్ కూడా ఎక్కువుందని ఇనయా చెప్పింది. కానీ ఫైనల్ గా ఈ టాస్క్ లో ఫస్ట్ ప్లేస్ శ్రీహాన్, రెండో ప్లేస్ రోహిత్ ఉన్నారని చెప్పారు. చివరిగా వచ్చిన కారణంగా కీర్తి ఔట్ అయిపోయింది.
బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఫినాలే టాస్క్..
తర్వాత వచ్చిన గుడ్డు జాగ్రత్త టాస్క్ లో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్ పాల్గొన్నారు. రోహిత్ కోసం ఫైమా తప్పుకుంది. ఈ టాస్క్ లో వరుసగా ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ వచ్చారు. మరోసారి హౌజ్ లో ఏకాభిప్రాయం అనే రచ్చ మొదలైంది. కానీ చివరికీ తక్కువ పాయింట్స్ తో ఫినాలే రేస్ నుంచి రోహిత్, ఫైమా, ఆదిరెడ్డి తప్పుకున్నట్లు సమాచారం.
ఫైనల్ రౌండ్ లో శ్రీహాన్, రేవంత్ పోటీ పడినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్ లో శ్రీహాన్ గెలిచి.. టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచినట్లు బీబీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. దీంతో ఫినాలేకు వెళ్లిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీహాన్ నిలిచాడని టాక్ వినిపిస్తోంది.