మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన రతికా రోజ్.. పెళ్లైన వాడితో కొత్త జర్నీ అంటూ పోస్ట్... అతడెవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలుసు. ఎవరూ ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కించుకుని విపరీతమైన సంఖ్యలో అబిమానుల్ని సంపాధించుకున్నారు చాలా మంది. మరికొంత మంది తీవ్రమైన నెగిటివిటీని కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి వాళ్లలో రతికా రోజ్ ముందు ఉంటుంది. అయితే తాజాగ ఈమె ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్.. అందులోనూ పెళ్లైన వాడితో కొత్త జర్నీని ప్రారంభించబోతున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చింది. అతడు ఎవరు, ఆసలు రతికా ఇలా పోస్ట్ ఎందుకు పెట్టిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోకి మొదటి వారంలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది రతికా రోజ్. అయితే తొలి వారంలోనే కామన్ మ్యాన్ గా వెళ్లిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో చాలా క్లోజ్ గా ఉంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని కూడా అంతా అనుకున్నారు. అయితే రెండో వారం నామినేషన్స్ రోజే రతికా రోజ్ ప్లేటు ఫిరాయించింది. హౌస్ మేట్స్ అందరితో కలిసి పల్లవి ప్రశాంత్ పై విరుచుకు పడి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. ఆమె పల్లవి ప్రశాంత్ పై వ్యవహరించిన తీరుతో బయట విపరీతమైన నెగిటివిటీ వచ్చింది.

ఇలా రైతుబిడ్డతో గొడవ పెట్టుకున్న ఈమె అదే వారంలో ప్రిన్స్ యావర్ తో కలిసి రచ్చ చేసింది. అతడితో క్లోజ్ గా ఉన్నట్లు వ్యవహరిస్తూ మరింత షో చేసింది. ఆమె చేసిన అతికి ప్రేక్షకులు ఇంటి నుంచి బయటకు పంపించారు. కానీ బయట ఆమెకు వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు మరోసారి హౌస్ లోకి అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత నుంచి స్పై బ్యాచ్ తో చాలా చక్కగా ఉంది. ఇక రెండో సారి ఎలిమినేట్ అయ్యే సమయంలో మరోసారి వీరిపై విరుచుకపడింది. చివరగా హౌస్ లోంచి బయటకు వచ్చేసింది.
బిగ్ బాస్ షో తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చేసిన ఆమె ఆ తర్వాత ఎక్కువగా ఎక్కడా కనిపించలేదు. కానీ గోవాకు వెళ్లి చాలా రోజులు అక్కడే గడిపింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫొటోను పెట్టింది. అయితే ఆ ఫొటోలు ఉంది మరెవరో కాదు.. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అండ్ రన్నరప్ అమర్ దీప్. అతడితో ఆమెకు అంతగా బాండింగ్ లేకపోయినా ఫొటో పెట్టడం, అందులోనూ కొత్త మంది స్నేహితులు చాలా విలువైన వారు అంటూ ఆమె రాసుకు రావడం నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.

స్నేహం వరకూ ఓకే కానీ... అవర్ జర్నీ బిగిన్స్ రెడీ టు ఎక్స్ ప్లోర్ మోర్ ప్లేసెస్ అంటూ చెప్పుకు వచ్చింది. రతికా ఈ పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ గా మారింది. నెటిజెన్లు అయితే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తూ.. రతికాను తిట్టి పోస్తున్నారు. స్పై బ్యాచ్ తో అయిపోయింది.. ఇక వీడా అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమె చేసింది కేవలం స్నేహం పరంగానే అయినప్పటికీ... నెటిజెన్లు మాత్రం వేరే విధంగా తీసుకుంటున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ చేసిన పోస్ట్ చూడండి.


Click it and Unblock the Notifications











