Don't Miss!
- News మూటెలు మోసిన అపర కుబేరుడు నవీన్ జిందాల్
- Sports GT vs DC: వార్నర్పై వేటు..కుర్రాడికి అవకాశం- పంత్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
సెలబ్రిటీల మధ్య బిగ్బాస్ దారుణంగా చిచ్చు.. విలన్గా మారిన హిమజ
Recommended Video
అత్యంత ప్రజాదరణ పొందుతున్న బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో 33వ రోజు ఇంట్లో గందరగోళం మధ్య సాగింది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేశాడు. పునర్నవి, శ్రీముఖి, అలీ రెజాను పిలిచి వారి గురించి ఇంటి సభ్యులు ఏమనుకొంటున్నారో వీడియో చూపించారు. దాంతో తమకు ఇష్టమైన వ్యక్తులు ఇలా మాట్లాడుతారా అంటూ వారిద్దరూ చిన్నబోయారు. ఆ తర్వాత హిమజను పిలిచి సీక్రెట్ టాస్క్ అప్పగించారు. ఇంతకు ఏం జరిగిందంటే...
ఇంటి సభ్యుల మధ్య చిచ్చు
ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ప్లాన్ చేసి.. అందులో భాగంగా పునర్నవిని పిలిచి ఆమెకు వితిక, రాహుల్ తన గురించి మాట్లాడిన వీడియోను చూపించారు. పునర్నవి గురించి వితిక చెడుగా మాట్లాడిన తీరుతో పునర్నవి మనస్తాపం చెందింది. తాను బాగా ఇష్టపడే వితికనే అలా మాట్లాడటంపై వారిని నిలదీసింది. దాంతో రాహుల్; వితిక, వరుణ్ మధ్య విభేదాలు పెరిగాయి.
శ్రీముఖికి వీడియో చూపించి
ఇక రెండో వ్యక్తిగా కన్ఫెషన్ రూమ్లోకి శ్రీముఖిని పిలిచి ఆమెకు తన గురించి చెడుగా మాట్లాడిన వీడియోను చూపించారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా గాజుపెట్టె పగులగొట్టిన సమయంలో వితిక, వరుణ్, పునర్నవి మాట్లాడిన మాటలు శ్రీముఖికి బాధ కలిగించాయి. కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చిన శ్రీముఖి.. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలీ రెజాకు కూడా
ఇక మూడో వ్యక్తిగా అలీ రెజాను పిలిచి ఓ వీడియోను చూపించారు. అందులో బాబా భాస్కర్ ఏడ్చిన వీడియోను చూసి అలీ రెజా బాధపడ్డాడు. తాను మాట్లాడిన తీరును గ్రహించాడు. బయటకు వచ్చి బాబా భాస్కర్ను బయటకు తీసుకువచ్చి సారీ చెప్పాడు. తన వల్ల ఇబ్బంది పడితే అందుకు క్షమాపణలు కోరుతున్నాని చెప్పాడు. దాంతో వారిద్దరి మధ్య విభేదాలకు ముగింపు పలికినట్లయింది.
హిమజ సీక్రెట్ టాస్క్
ఇక హిమజను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ అప్పగించారు. ఇంటిలో విలన్గా మారాలని సూచించాడు. అందరిపై కోపం ప్రదర్శించాలని చెప్పాడు. దాంతో హిమజ తన సత్తాను చూపించేందుకు సిద్ధమైంది. బాబా భాస్కర్పై గుడ్డు విషయంలో అరిచింది. తాను తినే ఆమ్లెట్ను డస్ట్ బీన్లో వేసింది. అంతేకాకుండా ఓ దశలో కోడిగుడ్లను పగలకొట్టింది. తనను తిననివ్వకుండా అడ్డుకొన్నందుకు ఇదే శాస్తి అని చెప్పింది.
హిమజ ఫెయిల్ అవ్వడంతో
ఆ తర్వాత , లగ్జరీ బడ్జెట్ టాస్క్ను అడ్డుకుంటే ఇమ్యునేషన్ వస్తుందని చెప్పడంతో అందుకు సిద్ధపడింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ను అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నించింది. ఇంటి సభ్యులు అడ్డుకోవడంతో ఆ పని జరుగలేదు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరికీ హిమజ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పడంతో అందరూ ఎగిరిగంతేశారు. సీక్రెట్ టాస్క్ సక్సెస్ కాకపోవడంతో ఇమ్యునిటీ లభించలేదు.