Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్ బాస్ అనుకున్నదే చేస్తున్నాడు.. అందుకే ఆ కంటెస్టెంట్ను హైలైట్ చేస్తున్నారు.!
భారతదేశంలోని అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటూ సక్సెస్ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఎన్నో అనుమానాల నడుమ మొదలై.. ఊహించని రీతిలో పాపులర్ అయిన ఈ షో.. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఈ మధ్యనే నాలుగో సీజన్ సైతం మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి మాత్రం మరింత ఎక్కువ రేటింగ్ను అందుకుంటోంది. అదే సమయంలో విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నిర్వహకులు ఓ కంటెస్టెంట్ విషయంలో వేసిన ఓ ప్లాన్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!
అన్నింటినీ మరిపించి మొదలైన సీజన్ 4
బిగ్ బాస్ నాలుగో సీజన్ గత నెలలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఎంతో సందడిగా సాగిన ఈ ప్రీమియర్ ఎపిసోడ్ను అక్కినేని నాగార్జున అద్భుతంగా హోస్ట్ చేశాడు. ఆరోజు పదహారు మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగు పెట్టారు. ఇక, గత మూడు సీజన్లకు మించి దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ ఎపిసోడ్కు రికార్డు రేటింగ్ వచ్చింది.
అప్పుడు వివాదాలు.. ఇప్పుడు విమర్శలు
తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తయ్యాయి. ఈ మూడు సీజన్లు ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయ్యాయి. ఆ సమయంలో షోను నిషేదించాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే, ఇప్పుడు మాత్రం అటువంటివి పెద్దగా కనిపించడం లేదు. కానీ, బిగ్ బాస్ నిర్వహకుల పనులతో విమర్శలు మాత్రం వస్తున్నాయి. దీంతో షోపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
వాళ్ల ఎలిమినేషన్తో పెరిగిన సందేహాలు
ఈ సీజన్ కంటెస్టెంట్లు దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివి ఎలిమినేట్ అయిన తీరు వివాదాస్పదం అయింది. ఈ ముగ్గురికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ.. షో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ పరిణామాలను బిగ్ బాస్ ప్రియులు జీర్ణించుకోలేకపోయారు. నిజాయితీగా ఆడిన ఈ ముగ్గురు ఎలిమినేట్ అవడంతో షో ఓటింగ్ సిస్టమ్పై అనుమానాలు కలిగాయి.
బిగ్ బాస్.. అనుకున్నట్లే చేస్తున్నాడా.?
బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి.? ఎవరు ఎలిమినేట్ అవ్వాలి.? అన్నది ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. కానీ, ఈ సీజన్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ప్రేక్షకులను కాదని, బిగ్ బాస్ నిర్వహకులే నచ్చిన వాళ్లను ఉంచి, మిగతా వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నారని అనిపిస్తోంది. దీంతో ఈ షో ప్లాన్ ప్రకారమే ప్రసారం అవుతుందన్న టాక్ కూడా బాగా వినిపిస్తోంది.
ఈ వారం డేంజర్ జోన్లో బిగ్ సెలెబ్రిటీ
ఈ
వారం
నామినేషన్
ప్రక్రియలో
మోనాల్
గజ్జర్,
మెహబూబ్,
అఖిల్
సార్థక్,
లాస్య,
అమ్మ
రాజశేఖర్,
ఆరియానా
గ్లోరీ
ఎలిమినేషన్
జోన్లోకి
వెళ్లారు.
ఈ
వారం
లగ్జరీ
బడ్జెట్
టాస్క్
నిరాశ
పరిచినప్పటికీ..
ఎలిమినేషన్
విషయంలో
ఉత్కంఠ
కొనసాగుతోంది.
అయితే,
తాజా
సమాచారం
ప్రకారం..
ఈ
వారం
అమ్మ
రాజశేఖర్
ఇంటి
నుంచి
బయటకు
వెళ్లడం
ఖాయమని
తెలుస్తోంది.
Recommended Video
ఆ కంటెస్టెంట్ను హైలైట్ చేస్తున్నారు.!
దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివిలు ఎలిమినేట్ అయినట్లుగానే ఈ వారం అమ్మ రాజశేఖర్ను ఎలిమినేట్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందుకే బిగ్ బాస్ నిర్వహకులు ఈ వారం మొత్తం ఆయననే హైలైట్ చేసి చూపించారని టాక్. అభిజీత్, హారిక, ఆరియానా సహా పలువురితో గొడవ పడడాన్ని చూపించడంతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి.