Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
బిగ్బాస్2లో జోరుగా పాలిటిక్స్.. కెప్టెన్గా సామ్రాట్రెడ్డి.. సంజనకు తేజస్వి షాక్!
బిగ్బాస్2 తెలుగు రియాలిటీ షో వివాదాస్పద అంశాలతో రంజుగా మారుతున్నది. తేజస్వి మదివాడ, సంజన అన్నె మధ్య విభేదాలు గట్టిగానే బయటపడుతున్నాయి. ఐదోరోజులో భాగంగా బిగ్బాస్ హౌస్ కోసం కెప్టెన్సీ ఎన్నిక ప్రధానమైన ఘట్టంగా మారింది. బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ కోసం సామ్రాట్ రెడ్డి, గణేష్, సంజన అన్నె, భానుశ్రీ పోటీపడ్డారు. పలు రాజకీయ ఎత్తుగడల మధ్య బిగ్బాస్ హౌస్ కెప్టెన్సీ ఎన్నిక జరుగడం గమనార్హం.
Recommended Video
బిగ్బాస్ కెప్టెన్సీ టాస్క్
హౌస్ కెప్టెన్సీ ఎన్నిక కోసం పోటీపడే ఒక్కొక్కరికి ఓ టాస్క్ ఇచ్చారు. గణేష్కు డంబెల్స్, ఎక్సర్సైజ్ చేసే రింగులు అమ్మే టాస్ ఇవ్వగా, సంజనకు సబ్బులు అమ్మకం చేపట్టే టాస్క్ను అప్పగించారు. అలాగే భానుశ్రీకి పోల్ డ్యాన్స్ టాస్క్ను, సామ్రాట్కు చాకోలెట్ సిరప్ అమ్మే టాస్క్ను అప్పగించారు.
ఎక్కువ కాయిన్స్ సంపాదించుకొంటే
ప్రతీ కంటెస్టెంట్కు కొన్ని పాయింట్ల కాయిన్స్ను అందజేసి.. అత్యుత్తమ ప్రదర్శన అందించిన వారికి కాయిన్స్ ఇవ్వండి.. ఎవరైతే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకొంటారో వారి కెప్టెన్గా ఎన్నికవుతారు అని బిగ్బాస్ స్పష్టం చేశారు.
గణేష్, సంజన టాస్కులతో
బిగ్బాస్ అప్పగించిన టాస్క్ను గణేష్ తన ఇంటి సభ్యుల ముందు ప్రదర్శించారు. నేను చాలా లావుగా ఉండేవాడిని. జిమ్కు వెళ్లకుండా కేవలం ఇంట్లో డంబెల్స్, రింగ్స్ తోనే నేను సన్నబడ్డాను. వీటిని కొనుగోలు చేసే మీరు కూడా నాజూకుగా తయారవ్వండి అని గణేస్ రిక్వెస్ చేశారు. అలాగే నా చర్మ సౌందర్యానికి ఈ సబ్బులే కారణం అంటూ సంజన తన ప్రొడక్ట్స్ను మార్కెట్ చేసింది.
భానుశ్రీ పోల్ డ్యాన్స్ టాస్క్
బిగ్బాస్ అప్పగించిన టాస్క్లో భాగంగా భానుశ్రీ పోల్ డ్యాన్స్ చేసింది. గాయని గీతా మాధురి పాడిన పాటలకు లయబద్దంగా పోల్ డాన్స్ చేసి భానుశ్రీ ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత సమ్రాట్ రెడ్డి చాక్లెట్ సిరప్ తాగడం వల్ల నేను హైట్ పెరిగాను. కండలు పెంచాను అంటూ ప్రమోషన్ చేపట్టారు. దాంతో నలుగురి టాస్కులు మిగిశాయి. ఈ పోటీలో ఎక్కువ కాయిన్స్ గెలుచుకొన్న సామ్రాట్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. కెప్టెన్గా ఎన్నికైనందుకు సామ్రాట్ ప్రత్యేక గదిని కేటాయించారు.
తేజస్వి, తనీష్ పాలిటిక్స్
కెప్టెన్ ఎన్నిక జరుగడానికి ముందు సామ్రాట్ గెలుపు కోసం తేజస్వి, తనీష్, రోల్ రైడా తదితరులు జోరుగా పాలిటిక్స్ చేశారు. ఎవరు ఎంత మంచిగా చేసినా సమ్రాట్కే ఎక్కువ కాయిన్స్ వేయాలని డిసైడ్ అయ్యారు. అలానే సామ్రాట్ సుమారు 395 విలువ గలిగిన కాయిన్స్ను గెలుచుకోవడం గమనార్హం.