Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Karthika Deepam క్షమిస్తుందా? హిమ ఎవరో కనిపెట్టేసిన శౌర్య... కార్తీకదీపంలో మరో ట్విస్టు
హిమకు ఆటో డ్రైవింగ్ నేర్పుతూ శౌర్య రోడ్డు పక్కన హోటల్కు తీసుకెళ్లింది. అక్కడ హోటల్లో పనిచేసే అబ్బాయిని హిమకు పరిచయం చేసింది. ఈ అబ్బాయి పేరు రవ్వ ఇడ్లీ అని చెప్పింది. రవ్వ ఇడ్లీ ఏం పేరు అంటూ ప్రశ్నించింది. అలా పరిచయాలు అయిపోయిన తర్వాత హిమ బాగా ఏడ్వడంతో ముఖాన్ని నీళ్లతో ప్రేమగా కడిగింది. ఆటో డ్రైవర్ జ్వాలాగా చెప్పుకొనే శౌర్య కురిపించిన ప్రేమను చూసి హిమ ఎమోషనల్ అయింది. ఇక శౌర్య హైదరాబాద్లోనే ఉందని తెలుసుకొన్న సౌందర్య ఆమెను వెతకడం మొదలుపెట్టింది. కార్తీక్, దీప పేరు మీద ఓ అమ్మాయి అర్చన చేసిందని చెప్పడంతో ఆలయాల వద్ద శౌర్య ఫోటో చూపించి.. ఎక్కడైనా చేశారా అని అడుగుతూ కనిపించింది. కార్తీక దీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1314లో ఇంకా ఏం జరిగిందంటే..
అబ్బాయి పేరు రవ్వ ఇడ్లీనా?
హోటల్లో పనిచేసి అబ్బాయి పేరు రవ్వ ఇడ్లీ ఏంటి? అని హిమ అనేక ఆలోచనల్లో పడింది. అప్పుడే హోటల్ వద్ద ముఖం కడుక్కొని వచ్చిన శౌర్య.. ఏమిటీ ఆలోచనల్లో పడ్డావు అంటే.. అబ్బాయి పేరు రవ్వ ఇడ్లీ ఏమిటి అని ఆలోచిస్తున్నానని చెప్పింది. అలాగే అబ్బాయిని పిలిచి ఇతడికి డాక్టర్ అవ్వాలని ఉందట అని శౌర్య చెబితే.. హోటల్ నడుపుతూ ఎప్పుడు చదువకొంటావు అని అడిగితే.. ఇతడే ఈ హోటల్కు ఓనర్ అని చెప్పింది. నేనే ఈ అబ్బాయిని ఇక్కడి తీసుకొచ్చి కొట్టుపెట్టించాను అని శౌర్య చెప్పింది. ఆ తర్వాత ఆటోలో హిమను తీసుకొని వెళ్లింది.
సొమ్మసిల్లిన హిమ.. శౌర్య ఏం చేసిందంటే?
ఆటోలో వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నాం అని హిమ అడిగితే.. ఎక్కడికి వెళ్లేది లేదు.. రోడ్డుపైన ఎక్కడ పడితే అక్కడ తినేసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. దాంతో ఠక్కున ఆటో ఆపేసి.. నీవు ఏం డాక్టర్వి. నేను ఎక్కడ పడితే అక్కడ తిందాం అని అంటే.. నీవు వద్దని చెప్పాలి. అలా చెప్పకుండా సరే అని తలూపడం కరెక్ట్ కాదు. నీవు అంత సెన్సిటివ్గా ఉండకూడదు అని చెప్పింది. అయితే అంతలోనే హిమ కళ్లు తిరిగి పడిపోయింది. దాంతో ముఖంపై నీళ్లు కొట్టి లేపింది. ఆ తర్వాత నీళ్లు తాగించడంతో హిమ ఉపశమనం చెందింది. ఆ తర్వాత ఆటోలో తీసుకెళ్లింది.
తల్లికి గుణపాఠం నేర్పిన ప్రేమ్
తన అత్త కూతురు హిమను ప్రేమిస్తున్న ప్రేమ.. తన ఫోన్లో ఉన్న హిమ ఫోటోను చూస్తూ తదేకంగా ఆలోచనల్లో మునిగిపోయాడు. అయితే తల్లి వచ్చి పిలిచినా వినిపించుకోలేనంత ప్రేమలో మునిగిపోయాడు. నీవు నా వద్దకు వచ్చేయని అంటే.. నాన్నను ఎవరు చూసుకొంటారు అని ప్రేమ అంటే.. మీ నాన్నకు వంట మనిషి ఉన్నారు కదా అని తల్లి అంటే.. కానీ నాన్నను వదిలి పెట్టి రాలేను అని ప్రేమ్ సమాధానం ఇచ్చాడు. అయితే ఏ తల్లికైనా చిన్న కొడుకు అంటే ఇష్టం. నీవంటే నాకు చాలా ఇష్టం. నీపై ప్రేమ ఎంతగానో ఉంది అని తల్లి అంటే.. నీవు నాన్నమ్మ వద్దకు వెళ్లి ప్రేమగా మాట్లాడి.. అప్పుడు నాకు ప్రేమ గురించి చెప్పు అని ప్రేమ్ ఝలక్ ఇచ్చాడు. అయితే నా వద్ద ఉంటే.. నిరుపమ్ మాదిరిగా డాక్టర్ అయి ఉండేవాడివి అని అంటే.. నాన్న నాకు స్వేచ్చ ఇచ్చాడు. నాకు ఇష్టమైన పనిని చేయడానికి అవకాశం ఇచ్చాడు. నీ వద్ద ఉంటే నీ అభిప్రాయాలు నాపై రుద్దే దానివి అని ప్రేమ్ బదులు ఇవ్వడంతో తల్లి కంగారు పడింది. కానీ ఎదో ఒకటి చెప్పి నాన్న వద్ద నుంచి వచ్చేయ్. నీకు ఎందుకింత పంతం అని చెప్పడంతో.. నేను నీ కొడుకును అందుకే నాకు ఇంత పంతం అని ప్రేమ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
శౌర్య నానమ్మను ఎప్పుడు కలుస్తావు? అంటూ
ఆలయాల వద్ద శౌర్య ఫోటో చూపించి పలువురిని అడిగితే చూడలేదని చెప్పడంతో సౌందర్య కంగారుపడింది. శౌర్య ఊర్లోనే ఉందని తెలిసింది. కానీ ఇప్పుడు ఎలా ఉందో గుర్తు పట్టడం కష్టంగా మారింది. శౌర్య ఇక్కడే ఉందని తెలిసి బాధపడాలా? లేదా ఆనంద పడాలా తెలియడం లేదు. శౌర్య.. ఈ నానమ్మను ఎప్పుడు కలుస్తావు? ఎలా ఉన్నావు అంటూ సౌందర్య కంటతడి పెట్టంది. శౌర్య కోసం వెతుకుతూ ఓ చోట కారును ఆపింది. శౌర్య ఎక్కడికి వెళ్లావు? మా గురించి అడిగితే అడ్రస్ తెలిసేది కదా.. మేము అమెరికాకు వెళ్లితే.. అడ్రస్ తెలిసేది కదా.. ఎక్కడున్నావు? ఎప్పుడు కలుస్తావు అని సౌందర్య పుట్టడంత బాధలో మునిగిపోయింది.
హిమకు పెళ్లి చేద్దామంటూ ప్రపోజల్
ఇంటికి
వెళ్లిన
తర్వాత
ఆలోచనల్లో
పడిన
భర్త
ఆనందరావును
సౌందర్య
కదలించింది.
ఎప్పుడు
ఏదో
ఆలోచిస్తుంటావు
అని
అడిగితే..
కార్తీక్
జీవితం
గురించి
తలుచుకొని
బాధపడ్డాడు.
ఏంటో
సౌందర్య..
దేవుడు
మనకు
ఎక్కువ
ఆయుష్షు
ఇచ్చాడు.
అందులో
కొంతైనా
వారికి
ఇచ్చి
ఉంటే
బాగుండేది.
కార్తీక్,
దీప
మరణంతో
మన
జీవితాల్లో
ఇంకా
విషాదం
మిగిలిపోయింది.
ఈ
విషాదం
నుంచి
బయటపడాలంటే..
హిమకు
పెళ్లి
జరిపించాల్సిందే
అని
చెప్పగానే
సౌందర్య
కంగారుపడిపోయింది.
హిమ ఎవరో కనిపెట్టేసిన శౌర్య
ఇదిలా
ఉండగా,
ఆటోలో
వచ్చిన
హిమ..
బస్తీలోని
తన
ఇంటికి
వెళ్లింది.
ఖాళీగా
ఎప్పుడు
లైట్లతో
ఉండే
ఇంటిలో
కార్తీక్
ఫోటోకు
పూలు
అర్పించి
మొక్కింది.
నాన్న
నన్ను
క్షమించు.
నేను
చేసిన
తప్పుకు
శౌర్య
క్షమిస్తుందో
లేదో..
కానీ
శౌర్యను
కలువాలి
అంటూ
హిమ
కన్నీళ్లు
పెట్టుకొన్నది.
అయితే
తనకు
తెలిసిన
ఇంటిలో
లైట్లు
వేసి
ఉండటంతో
శౌర్య
ఎవరు
ఉన్నారు
అని
అందులోకి
అడుగుపెట్టింది.
అంతలోనే
కార్తీక్
ఫోటో
వద్ద
హిమ
దండం
పెడుతూ
కన్నీళ్లు
పెట్టుకోవడం
చూసి
శౌర్య
షాక్
గురైంది.
తాజా
ట్విస్టుతో
హిమ,
శౌర్య
కలిసేందుకు
మార్గం
సుగమైంది.
ఈ
ట్విస్టు
సీరియల్లో
మరింత
ఫీల్గుడ్గా
మారింది.