Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Karthika Deepam భార్యభర్తలుగా మారిన డాక్టర్ సాబ్.. ఆటో డ్రైవర్.. చిన్న ట్విస్టుతో ఎమోషనల్గా
హిమపై తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హిమను పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులను ఒప్పిస్తే సరిపోతుందంటూ ఆమెకు ఫోన్ కలిపారు. అర్జెంట్గా ఇంటికి రా.. అంటే.. ఇప్పుడా అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో జ్వాలా బిర్యానీ తెచ్చింది. నీవు ఇక్కడికి రా.. కలిసి భోజనం చేద్దాం. నిరుపమ్ కూడా వస్తున్నాడు. అందరూ కలిసి భోజనం చేద్దాం రా అంటూ ఫోన్లో మాట్లాడుతుంటే.. జ్వాలా డిస్ట్రబ్ చేసింది. భోజనం చేస్తారా లేదా అంటూ విసుగుకొన్నది. దాంతో ఫోన్ కూడా మాట్లాడనివ్వవా? బిర్యాని తినడానికి మీ డాక్టర్ సాబ్ కూడా వస్తున్నాడు అంటూ ప్రేమ్ చెప్పడంతో జ్వాలా హ్యాపీగా ఫీల్ అయింది. కార్తీకదీపం సీరియల్ 1345 ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందంటే
కార్తీక్, దీప ఫోటో ముందు సౌందర్య
కార్తీక్, దీప ఫోటో ముందు నిలబడి సౌందర్య ఎమోషనల్ అయింది. మీరు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. మాకు తొడుగా ఆదిత్య ఉన్నాడనుకొంటే.. వాళ్లు అమెరికాకు వెళ్లిపోయారు. స్వప్న తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకొంటున్నది. తన మొండిపట్టు వీడటం లేదు. సత్యం ఒకచోట.. స్వప్న మరో చోట.. మన ఫ్యామిలీకి ఏదో శాపం తగిలినట్టు ఉంది. పెళ్లైన కొద్ది రోజులకే దీప,నీవు విడిపోయారు. ఈ రోజు సత్యం, స్వప్న పెళ్లి రోజు.. మీరందరూ ఉండి ఉంటే.. ఒకే ఇంట్లో మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేసుకొనే వాళ్లం అని బాధపడుతుంటే.. హిమ వచ్చి సత్యం మామ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లింది. అందరు కలిసి ఉండాలని అనుకొంటాం. కానీ అందరికి కలిసి ఉండాలని అనుకోవాలి కదా అంటూ సౌందర్య బాధపడింది.
జ్వాలా నీ సహాయం కావాలి అంటూ
నిరుపమ్, ప్రేమ్, హిమ, జ్వాలా కలిసి బిర్యాని తింటుండగా.. బిర్యాని బాగుంది అంటూ జ్వాలాను నిరుపమ్ మెచ్చుకొన్నాడు. అయితే జ్వాలా బిర్యానీ చేసి ఉండదు. వాళ్ల పిన్ని చేసి ఉంటాదేమో అని ప్రేమ్ దెప్పి పొడిచాడు. అయితే బిర్యానీ తినండి.. అంతేగానీ పిచ్చి మాటలు వద్దు అని జ్వాలా అన్నారు. భోజనం చేస్తూ.. ప్రేమ్తో నిరుపమ్ మాట్లాడుతూ.. మనమంతా కలిసి ఉండాలి. అమ్మ, నాన్న మనం కలిసిపోవాలి అంటూ నిరుపమ్ ఎమోషనల్ అయ్యాడు. సత్యం మందు తాగడంపై చర్చ జరిగింది. అమ్మకు దూరమై బాధను అనుభవిస్తున్నాడు. ఆయన లోకం ఆయనది. అమ్మ, నాన్న పెళ్లి రోజు వస్తున్నది. వారిని కలిపేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు నీ సహాయం కావాలి అంటూ జ్వాలాను నిరుపమ్ అడిగాడు.
భార్య, భర్తలుగా జ్వాలా, నిరుపమ్
అప్పటికే పీకల్లోతు ప్రేమానుభూతిని పొందుతున్న జ్వాలా.. డ్రీమ్లోకి వెళ్లిపోయింది. భార్య, భర్తలుగా నిరుపమ్ను ఊహించుకొన్నది. ఏంటి శ్రీమతి గారు అంటూ జ్వాలాను అడిగితే.. ఏమిటీ లేట్ అయిందంటూ ప్రశ్నించింది. ఈ రోజు సర్జరీ ఉండటంతో లేట్ అయిందంటూ సమాధానం చెప్పాడు. శ్రీవారు.. ఈ రోజు మీ కోసం బిర్యానీ చేశాను అని జ్వాలా అంటే.. అవునా చెప్పలేదు అని నిరుపమ్ అంటే.. ఎలాగు లేటుగా వస్తావు కదా.. అందుకే చెప్పలేదు అని జ్వాలా ఊహించుకొన్నది. జ్వాలా డ్రీమ్లో ఉండటంతో.. హల్లో రౌడీ బేబీ అంటూ అందరూ ఆటపట్టించారు. ఏ లోకం ఉన్నావని నిరుపమ్ అడిగితే.. నిన్ను చూస్తే ఏదో లోకంలోకి వెళ్లిపోతాను అంటూ జ్వాలా ఎమోషనల్ అయింది. అయితే భోజనం చేస్తూనే ప్రేమ్తో తల్లి, తండ్రి సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డే గురించి ఆలోచించారు.
సత్యం, స్వప్న మ్యారేజ్ డే ప్లాన్స్
అయితే ప్రేమ్, హిమ ఇద్దరు కూడా సౌందర్యతో సత్యం, స్వప్న మ్యారేజ్ డే గురించి చర్చించాడు. అత్తను ఒప్పించే భాద్యతను నిరుపమ్ తీసుకొన్నాడు అని జ్వాలా అంటే.. అవును నేను డాడీని ఒప్పిస్తాను అని ప్రేమ్ చెప్పాడు. అయితే స్వప్న తన మనసు మార్చుకొంటే బాగుండు అని అంటే.. ఇప్పటికిప్పుడు మార్చాలంటే సాధ్యపడదు అని ప్రేమ్ అన్నాడు. అయితే ఇప్పటికిప్పుడు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం ఎలా అంటే.. ఒక్క ఫోన్ కొడితే.. చాలూ. నిమిషాల్లో ఈవెంట్ ఆర్గనైజర్స్ అరెంజ్ చేస్తారు అంటూ ప్రేమ్ చెప్పాడు. అయితే ఇలా మాట్లాడుతుంటే.. సౌందర్యకు ఫోన్ రావడంతో బయటకు వెళ్లింది.
అక్క అంటే.. చెంప పగలగొట్టిన జ్వాలా
జ్వాలా
చిత్తు
కాగితాలు
అమ్మే
షాప్
వద్దకు
వెళ్లింది.
చిత్తు
కాగితాలు
కావాలంటూ
జ్వాలా
షాపు
యజమానిని
అడిగింది.
ఆర్టిస్ట్
గీసిన
తన,
హిమ
బొమ్మలు
కింద
పడి
ఉన్నాయి.
అయితే
జ్వాలా
వాటిని
చూసుకోలేకపోయింది.
అంతలోనే
సౌందర్య
కూడా
అక్కడికి
వచ్చింది.
అయితే
అంతలోనే
ఓ
దొంగ
వచ్చి..
జ్వాలా
ఆటోలో
నుంచి
డబ్బులు
దొంగిలిస్తున్న
వాడిని
చూసి..
సౌందర్య
అలర్ట్
అయింది.
వెంటనే
వాడిని
పట్టుకొని..
దొంగ
వెధవ..
ఆమె
కష్టాన్ని
దోచుకొంటున్నావా?
అని
సౌందర్య
వార్నింగ్
ఇచ్చింది.
ఏంటిరా?
దొంగతనం
చేయడమేంటిరా
అంటే..
ఇంకోసారి
చేయను
అక్క
అంటే..
వెంటనే
జ్వాలా
వాడిని
చెంపపై
కొట్టింది.
అక్క
అంటే
అందరు
ఆడవాళ్ల
మాదిరిగా
నీకు
నచ్చదా..
కామెంట్
విసిరాడు.
అయితే
వాడిని
వెళ్లిపో
అంటూ
కొంత
డబ్బు
చేతిలో
పెట్టి
తిన్నావో
లేదో
అంటూ
దొంగను
పంపించింది.
జ్వాలా
ఉదారబుద్దిని
చూసి
హ్యాపీగా
ఫీలైంది.
కానీ
అక్కడ
పడి
ఉన్న
హిమ
బొమ్మను
చూడకుండా
వెళ్లింది.
కార్తీకదీపం సీరియల్ 7వ వారం రేటింగ్
కార్తీకదీపం సీరియల్ రేటింగ్ గత కొద్ది వారాలుగా పడిపోతున్నది. గతంలో 13 పాయింట్లకుపైగా రేటింగ్ నమోదు అయ్యేది. ఈ ఏడాది 17వ వారంలో మరింత రేటింగ్ క్షీణించింది. 16వ వారంలో కార్తీకదీపం రేటింగ్ 11.51 రేటింగ్ నమోదు కాగా, 17వ వారంలో 11.42 రేటింగ్ను నమోదు చేసింది. అయితే ఈ రేటింగ్ పడిపోవడానికి కారణం ఒకటి ఐపీఎల్ టోర్నీ కాగా, రెండోది కంటెంట్లో సాగదీత ఎక్కువగా ఉండటమే అని టెలివిజన్ వర్గాలు పేర్కొంటున్నాయి.