బాలుడి ప్రాణం తీసిన టీవీ చానెల్ పంతం

By Pratap

Boy refuses to change TV channel, sibling ends life
బోపాల్: టెలివిజన్ చానెల్ మార్పు గొడవ 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసింది. టీవీ మార్పుపై తమ్ముడితో గొడవ పడిన బాలుడు శనివారం సాయంత్రం తన పంతం నెగ్గకపోపవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం బోపాల్‌లో జరిగింది. మృతుడు ఓ చానెల్ చూడాలని పట్టుబట్టగా కార్టూన్ చానెల్ కోసం అతని తమ్ముడు పంతానికి వచ్చాడు. తమ్ముడి పంతంతో మనస్తాపానికి గురైన బాలుడు మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని మరణించాడు.

మృతుడిని పాండీగా గుర్తించారు. బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని బి సెక్టార్ నెంబర్ 2లో నివాసం ఉంటున్న షెట్టీ రావు కుమారుడు అతను. తల్లిదండ్రులు హాట్ మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. ఆ సమయంలో పాండీ తన తొమ్మిదేళ్ల తమ్ముడు అనీస్‌తో కలిసి టీవీ చూస్తున్నాడు.

తన తమ్ముడు కార్టూన్ చానెల్‌ నుంచి మరో చానెల్‌కు మార్చడానికి ఏ మాత్రం ఇష్టపడక గొడవ పడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండీ మొదట ఆల్మారా అద్దాలు పగులగొట్టి ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంఘటన గురించి తెలిసింది.

తల్లిదండ్రులు వచ్చేసరికి అనీస్ బోరున ఏడుస్తున్నాడు. వారు అందుకు కారణం అడగ్గా ఉరేసుకుని వేలాడుతున్న అన్నను చూపించాడు. వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతలో ఇరుగుపొగరుగువారు గుమికూడారు. సంఘటనా స్థలంలో ఏ విధమైన సూసైడ్ నోట్ లభించలేదు. పాండీ తండ్రి బిహెచ్ఇఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడు. పాండీ మూడో తరగతో నాలుగో తరగతో చదివి వదిలేశాడు. తమ్ముడు పాఠశాలకు వెళ్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X