Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకింగ్ డెసీషన్: బుల్లితెర ప్రియులకు చేదువార్త.. జబర్ధస్త్, అదిరింది సహా ఆ సీరియల్స్కు బ్రేక్.!
తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వస్తుంటాయి. అయితే, వాటిలో మాత్రం కొన్నింటికే పాపులారిటీ వస్తుంది. అలాంటి షోలలో జబర్ధస్త్ ఒకటి. దాదాపు పదమూడేళ్లుగా ప్రసారమవుతున్న ఈ షోకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనితో పాటు మరికొన్ని షోలు కూడా పలు చానెళ్లలో ప్రసారం అవుతున్నాయి. అలాంటి వాటిలో పటాస్, పోవే పోరా, అదిరింది సహా మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడా షోలు అన్నీ ఆగిపోనున్నాయి. అవును.. తాజాగా లీకైన ఓ న్యూస్ కామెడీ ప్రియులను షాక్కు గురి చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!
దేనికదే.. అన్నింటికీ భారీ క్రేజ్
తెలుగులో బుల్లితెరపై వస్తున్న కామెడీ షోలు చాలానే ఉన్నాయి. వాటిలో జబర్ధస్త్, అదిరింది, పటాస్, పోవే పోరా సహా మరికొన్ని షోలు కామెడీ ప్రధానంగానే రూపొందుతున్నాయి. ఈ షోలన్నింటికీ భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. వారంలో ఒకటి, రెండు రోజులు ప్రసారం అయ్యే ఈ షోలు చాలా రోజులుగా విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి.
ఈ రెండింటికీ పోటీ.. ఏది బెస్ట్.?
ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతున్న జబర్ధస్త్కు పోటీగా ఇటీవల ‘అదిరింది' అనే షో వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మెగా బ్రదర్ నాగబాబు సహా చాలా మంది జబర్ధస్త్ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. దీంతో ఈ రెండు షోల మధ్య పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రెండు షోల నిర్వహకులు సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు.
బుల్లితెర ప్రియులకు చేదువార్త
కొద్ది రోజులుగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని టీవీ సీరియల్స్, గేమ్ షోస్, వెబ్ సిరీస్ షూటింగ్స్ నిలిపివేయాలని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ నెల 31 వరకు వీళ్లంతా షూటింగులకు దూరంగా ఉండనున్నారు.
ఈ కామెడీ షోలన్నీ ఆగిపోతున్నాయి
దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ బంద్ కానున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. రెండు వారాలకు ఒకసారి షెడ్యూల్ జరుపుకునే జబర్ధస్త్, అదిరింది, పటాస్, పోవే పోరాతో పాటు మరికొన్ని షోలు ఆగిపోనున్నాయట. అయితే, ఇది ఒకటి రెండు ఎపిసోడ్స్కు మాత్రమే ఇబ్బందిగా మారుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఈ టీవీ సీరియళ్లకు కూడా బ్రేక్
వాస్తవానికి టీవీ సీరియళ్ల విషయంలో ఇది పెద్ద ఇబ్బందే కాదు. అయితే, కొత్తగా ప్రసారం అవుతున్న వాటికి మాత్రం కష్టాలు తప్పవట. అలాగే, లీడ్ యాక్టర్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. ఇలా జరగడం వల్ల కొన్ని సీరియళ్ల ప్రసారాలు తాత్కాలికంగా ఆగిపోయే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
సినిమా వాళ్లకూ తప్పని కష్టాలు
కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగులకు సైతం ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్తో పాటు టెక్నీషియన్లు షూటింగులకు విరామం ప్రకటించారు. అంతేకాదు, సినిమా హాళ్లు కూడా మూత పడ్డాయి. ఈ నెల 31 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.