Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కేక పెట్టిస్తున్న ‘మా టీవీ’ కాంచన గంగ
ఇక ఈ సీరియల్ లో ప్రధాన కధాంశం విషయానికి వస్తే... దేవదాసి తెగకు చెందిన దేవయాని జమీందారు నరేంద్రవర్మకి ఉంపుడుగత్తెగా మారుతుంది. తన కూతురు కాంచన జీవితం తనలా మారకూడదని, పెళ్లి చేసుకుని గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకుంటుంది దేవయాని. జమీందారు కూతురి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అందవిహీనురాలని మాట దాటేస్తుంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ కూతురిపై జమీందారు దృష్టి పడుతుంది. ఈ కామంధుడి బారి నుంచి కూతుర్ని కాపాడుకోవడానికి దేవయాని ఏం చేస్తుంది? కూతురి జీవితం విషయంలో ఆమె కన్న కలలు ఫలిస్తాయా? అనే కథాంశం చుట్టూ తిరుగుతుంది.
ఈ సీరియల్ లో ప్రదాన పాత్ర చేస్తున్న ఛాయా సింగ్ గతంలో తిరుడా తిరుడీ అనే తమిళ చిత్రంలో చేసి పేరు తెచ్చుకుంది. అంతేగాక అనేక తమిళ,మళయాళ,కన్నడ సినిమాలు కూడా చేసింది. తొలిసారిగా ఆమె కాంచన గంగతో సీరియల్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ తనకు మంచి పేరు తెచ్చి పెట్టి అనేక ఆఫర్స్ సంపాదిస్తుంది ఆమె ఆశిస్తోంది.
పృథ్వీరాజ్, ఛాయాసింగ్, మంజుల, భావన, బేబి లిఖిత, బేబి యాని తదితరులు నటిస్తున్న ఈ సీరియల్ని విజయకృష్ణ దర్శకత్వంలో అశోక్ నిర్మిస్తున్నారు. మా టీవీలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది.