Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ స్టూడియోపై దాడి, హీరోయిన్ కారు ధ్వంసం
ముంబయి : ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఫిల్మాలయ్ స్టూడియోను శనివారం రాత్రి అజ్ఞాత యువకులు ధ్వంసం చేశారు. సూపర్ ఫైట్ లీగ్ టీవీ ధారావాహికను చిత్రీకరిస్తున్నప్పుడు ఈ సంఘటన సంభవించింది. మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) పార్టీ కార్యకర్తలే ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చునని సందేహిస్తున్నారు. ఈ విషయమై బాలీవుడ్ లో చాలా మంది ఇలాంటి సంఘటన ఊహించలేమని,షాక్ చెందామని చెప్తున్నారు.
ఆంబోలీలోని ఫిల్మాలయ్ స్టూడియోలో రాత్రి పాసులు లేకున్నా షూటింగ్ చూసేందుకు కొందరు యువకులు యత్నించారు. భద్రత సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాసేపటికి 60 నుంచి 70 మంది యువకులు చొచ్చుకొని వచ్చి విధ్వంసం సృష్టించారు. భద్రతా సిబ్బందిని చితకబాదారు. ఆ సమయంలో స్టూడియోలో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఉన్నారు.
వీరి వాహనాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దుండగులు ఎమ్మెన్నెస్ కార్యకర్తలై ఉండవచ్చునని, అంతేకాకుండా చిత్రీకరణ కోసం కొంత సొమ్మును డిమాండ్ చేశారని రాజ్ కుంద్రా తెలిపారు. దీనికి నిరాకరించడంతో విధ్వంసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక మహిళతో అనుచితంగా వ్యవహరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.