Don't Miss!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఎన్ని జన్మలైనా నువ్వే.. జీవితం బిస్కట్.. తనీష్కు దీప్తి సునైన ఎమోషనల్ లెటర్!
బిగ్బాస్ రియాలిటీ షోలో తనీష్, దీప్తి సునైనల మధ్య రిలేషన్లో ఓ రేంజ్లో సాగింది. బ్రో అంటూనే దీప్తి సునైనా తనీష్కు దగ్గరైంది. గత 70 రోజులుగా వారు కలిసే తిరిగారు. కలిసి ఉన్నారు. వారి రిలేషన్ గురించి ఇద్దరికి ఏకంగా నాని చివాట్లు పెట్టడం కూడా జరిగింది. తనీష్ కోసం ఇంట్లోకి వచ్చావా లేక గేమ్ ఆడటానికి వచ్చావా అంటూ నాని నిలదీశాడు. కానీ 70వ రోజు తర్వాత దీప్తి సునైన గేమ్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇంటి నుంచి బయటకు వస్తూ నీకు ఓ లెటర్ రాసి బెడ్పై పెట్టాను చూసుకో అని చెప్పింది.
తనీష్.. నీవు ఉంటే చాలూ
దీప్తి సునైన ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత తనీష్ ఆ ఉత్తరం తీసి చదివాడు. ఆ లెటర్లో ‘ఇప్పుడు నా జీవితంలో ఎవరు ఉన్న లేకపోయిన సరే.. మనం కలిసి ఉంటే అది నాకు చాలూ అనిపిస్తున్నది అని దీప్తి సునైనా రాసింది.
Recommended Video
నీవు లేకపోయే సరికి
అలాగే ‘ఈ రోజు నీవు లేకపోయే సరికి నా డే మొత్తం బిస్కట్ అయిపోయింది. ఈ సందర్బంగా ఒకటి చెప్పాలనుకొంటున్నాను. ఎన్ని జన్మలు ఉన్న నువ్వే నాకు అన్నగా ఉండాలి. ఇదే నాకు ఫ్యామిలీ కావాలి.
ఫుడ్ సరిగా పెట్టలేదు
ఇంకో విషయం నీకు చెప్పాలి. ఈ రోజు నీవు నాతో లేవు. నాకు సరిగా ఫుడ్ కూడా పెట్టలేదు. వంట కూడా సరిగా చేయలేదు. చాలా బాధగా ఉంది అంటూ తనీష్తో ఆవేదనను వ్యక్తం చేసింది.
ఐ లవ్ యూ సో మచ్
చివరగా డోరేమాన్ (ముద్దుగా పిలచుకొనే పేరు).. ఐ లవ్ యూ సో మచ్. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఎక్కువగా కోపం తెచ్చుకోకు. ఎప్పుడూ స్మైల్ చేస్తూనే ఉండు అని తనీష్కు దీప్తి సునైనా లెటర్లో చెప్పింది.
తనీష్ ఎమోషనల్
దీప్తి సునైనా రాసిన లెటర్ చదువుతూ తనీష్ ఉద్వేగానికి లోనయ్యాడు. తనీష్ లెటర్ చదువుతుంటే గీతా మాధురి ఏ రాసింది అని అతృతగా అడిగింది. ఒకవేళ పర్సనల్ అయితే మాత్రం బయటకు చెప్పకు అని చెప్పింది. అయితే దీప్తి ఐ లవ్ యూ సో మచ్.. మిస్ యూ అనే పదాలు పలికి అది రాసింది అని చెప్పాడు.