Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నన్ను బలి చేశారు..పవన్ ఫ్యాన్స్ వల్లే అంటూ..దివి అవుట్ తర్వాత బిగ్బాస్ ఎలిమినేషన్పై దేవీ నాగవల్లి
దివి వద్యా ఎలిమినేషన్ తర్వాత బిగ్బాస్ తెలుగు షోపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిగ్బాస్లో తనకు జరిగిన అన్యాయాన్ని మరోసారి దేవీ నాగవల్లి చెప్పారు. ఎలిమినేషన్ విషయం నాకు చాలా షాక్ గురిచేసింది. బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. అప్పటి వరకు సరేలే అనే అభిప్రాయంతో ఉన్నాను. కానీ బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత నాకు తెలిసిన విషయాలు షాక్ గురిచేశాయి. దేవీ నాగవల్లి మాట్లాడుతూ..
నా ఎలిమినేషన్పై అనుమానం
బిగ్బాస్ హౌస్లో ఎలిమినేషన్ అయ్యారంటూ ప్రకటించిన తర్వాత నేను నా మైండ్ బ్లాంక్ అయింది. ఎలా స్పందించాలో అర్ధం కావడం కాలేదు. జెన్యూన్ ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేశామని చెబితే నాకు అనుమానం కలిగింది. అప్పటికప్పుడే ఆడియో విజ్వువల్ (ఏవీ) వీడియో చేయాల్సి వచ్చింది అని చెబితే.. అప్పటికప్పుడు ఎలా చేస్తారు అని నేను ప్రశ్నించాను అని దేవీ నాగవల్లి అన్నారు.
ముక్కుసూటిగా మాట్లాడటం వల్లే
అప్పటికప్పుడు వీడియో తయారు చేశానంటే.. అనుమానం రాలేదు. వారు కొన్ని ప్రశ్నలు వేసేవారు. వాటికి ముక్కుసూటిగా జవాబులు చెప్పదానిని. అందువల్ల నన్ను ఎలిమినేట్ చేశారని అనుకొన్నాను. కానీ బయటకు వచ్చిన తర్వాత మీకంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లు ఉన్నారని చెబితే షాక్ కు గురయ్యాను అని దేవీ నాగవల్లి తెలిపారు.
నాకంటే మెహబూబ్కి తక్కువ ఓట్లు
బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత చాలా మంది ఓటింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ పంపించారు. మీ కంటే తక్కువ ఓట్లు మెహబూబ్కు వచ్చాయంటే నాకు షాక్ కలిగించింది. నన్ను ఎందుకు ఎలిమినేట్ చేశారనే విషయం అర్ధం కాలేదు అని దేవీ నాగవల్లి అన్నారు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేయకుండా
సోషల్ మీడియాలోను, ఆ తర్వాత నాకు తెలిసిన సమాచారంతో నేను డైలామాలో పడ్డాను. నేను అందరి మధ్యలో బలైపోయానా అని దేవీ నాగవల్లి అన్నారు. నా ఎలిమినేషన్కు నేను పనిచేసే టీవీ ఛానెల్ కారణమన్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ను ఓట్లు వేయకుండా చేశారని అన్నారు. అయితే నన్ను నన్నుగా చూస్తే బాగుండేది అని దేవి నాగవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
నా కులం గురించి వివాదం
నా ఎలిమినేషన్ వెనుక వార్తలను విని చాలా బాధపడ్డాను. హర్ట్ అయి చాలా రోజులు బయటకు రాలేదు. అయితే తర్వాత నా కులం గురించి కాకుండా.. నా వ్యక్తిగత జీవితం గురించి ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యారు. అందుకు నాకు సంతోషం వేసింది. ఇప్పుడు బయట నాకు ఓ పాజిటివ్తో కూడిన రెస్పాన్స్ వస్తున్నది అని దేవీ నాగవల్లి చెప్పారు.
Recommended Video
దాసరి నా బంధువని ఎందుకు చెప్పలేదంటే
దాసరి నాకు సమీప బంధువు. అయితే నేను ఎప్పుడు బయటపెట్టలేదు. నాకు కులం పేరును వాడుకోవడం ఇష్టం లేదు. అలాగే నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ట్యాగ్ను వాడుకోలేదు. ఎందుకంటే నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది. దాని వల్లే గుర్తింపు పొందాలని అనుకొంటాను. నా ప్రొఫెషన్ను, నా వ్యక్తిగత విషయాల ఆధారంగాను గుర్తింపు పొందాలనుకొంటాను అని దేవీ నాగవల్లి పేర్కొన్నారు.