Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆర్జీవీ వర్సెస్ నాగబాబు: అప్పటి రచ్చను గుర్తు చేస్తూ సెటైర్లు వేసిన కమెడియన్.!
టాలీవుడ్లోని దర్శకులందరిలో ప్రత్యేకమైన వ్యక్తి రాంగోపాల్ వర్మ. దీనికి కారణం ఆయన చాలా కాలంగా వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తుండడంతో పాటు కొందరిని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండడమే. ఇలా ఎంతో మందికి శత్రువుగా మారుతున్నాడు ఆర్జీవీ. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఇక, ఈ మధ్య 'పవర్ స్టార్' అనే చిత్రంతో మరోసారి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓ ఫేమస్ కమెడియన్ అప్పటి రచ్చను గుర్తి చేస్తూ సెటైర్లు వేశాడు. ఆ వివరాలు మీకోసం.!
‘పవర్ స్టార్'తో మళ్లీ మొదలైన వివాదం
కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి... రాంగోపాల్ వర్మకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని కొనసాగిస్తూ సంచలన దర్శకుడు ఇటీవల ‘పవర్ స్టార్' అనే సినిమాను తెరకెక్కించాడు. పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ వల్ల ఇరు వర్గాల మధ్య వార్ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వర్మపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు.
మెగా ఫ్యామిలీకి ఫిల్మ్ సెలెబ్రిటీల మద్దతు
‘పవర్ స్టార్' మూవీతో టాలీవుడ్లో కలకలం రేగింది. ఈ క్రమంలోనే చాలా మంది సినీ సెలెబ్రిటీలు మెగా ఫ్యామిలీకి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, కొందరైతే ప్రత్యకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక, ఔత్సాహిక ప్రముఖులు మాత్రం రాంగోపాల్ వర్మను తిడుతూ వీడియోలను వదిలారు. దీంతో మెగా - ఆర్జీవీ వార్ తారాస్థాయికి చేరుకుంటోంది.
నాగబాబు సైలెంట్.. వాళ్లు కూడా అంతే
రాంగోపాల్ వర్మ తీసిన సినిమా పవన్ కల్యాణ్ను ఉద్దేశించిందే అని తెలిసినా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించకపోవడం విశేషం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు దీనిపై మాట్లాడతారని చాలా మంది అనుకున్నారు. కానీ, ఆయన మాత్రం కామ్గా ఉండిపోయారు. మిగిలిన హీరోలు కూడా ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదు.
అప్పుడు మాత్రం మెగా బ్రదర్ ఆగ్రహం
చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150' వచ్చిన సమయంలో రాంగోపాల్ వర్మ... ఈ సినిమాను ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్లు చేశాడు. దానిపై ప్రీరిలీజ్ ఈవెంట్లో స్పందించాడు నాగబాబు. ‘ఫేమస్ అవడం కోసం మెగా ఫ్యామిలీని కొందరు టార్గెట్ చేస్తున్నారు. అందులో ముంబైలో ఉండే ఓ డైరెక్టర్ అక్కుపక్షి.. సన్నాసి.. వేస్ట్ ఫెలో ఒకడు' అంటూ ఆగ్రహంతో మాట్లాడాడు.
నాగబాబు దెబ్బకు గూగుల్లో ట్రెండ్
ప్రీరిలీజ్ వేదికపై నాగబాబు.. రాంగోపాల్ వర్మను ఉద్దేశిస్తూ కామెంట్ చేసిన ‘అక్కుపక్షి' అనే పదం అప్పట్లో హైలైట్ అయింది. దీంతో చాలా మంది దానికి అర్థం ఏంటి అని గూగుల్ను ఆశ్రయించారు. దీంతో ఈ పదం గూగుల్ ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అయింది. అప్పటి నుంచి వర్మను మెగా అభిమానులు ఇదే పేరుతో పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే.
రచ్చను గుర్తు చేస్తూ సెటైర్లు వేశాడు
‘అక్కుపక్షి' ఘటన తర్వాత నాగబాబు - రాంగోపాల్ వర్మ మధ్య మాటల యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఈ వివాదాన్ని మరింతగా సాగదీశారు. ఇక, ఇప్పుడిప్పుదే దీన్ని అందరూ మర్చిపోతున్నారు అనుకుంటున్న సమయంలో... ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతోన్న అదిరింది షోలో కమెడియన్ ధన్రాజ్ గుర్తు చేశాడు.
Recommended Video
ఆయననే అడగమంటూ చెప్పడంతో
స్కిట్లో భాగంగా ధన్రాజ్ను సహచర ఆర్టిస్టు ‘గురువు గారూ గురువు గారూ... అక్కుపక్షి అంటే ఏమిటి' అని ప్రశ్నిస్తాడు. దీనికి ‘ఈ విషయం నన్ను కాదురా.. పేరు పెట్టిన ఆయన్నే అడుగు' అంటూ నాగబాబు వైపు చూపిస్తాడు టీమ్ లీడర్ ధన్రాజ్. అప్పుడు మెగా బ్రదర్ కూడా పగలబడి నవ్వుతాడు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది.