Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచు లక్ష్మి అతిధి...ఈటీవీ కే అవార్డు
హైదరాబాద్: బాల బాలికలు, విద్యార్థులకు సంబంధించిన వివిధ అంశాల్లో యూనిసెఫ్ మొత్తం తొమ్మిది విభాగాల్లో అవార్డులను ప్రకటించగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రెండు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అయా అంశాలపై నిర్వహించిన చర్చల విభాగంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమవుతున్న ప్రతిధ్వని కార్యక్రమాన్ని యూనిసెఫ్ అవార్డు వరించింది.
హైదరాబాద్లో నిర్వహించిన యూనిసెఫ్ అవార్డు ప్రదానోత్సవంలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటీవీ తరఫున ప్రతిధ్వని ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ జీవీఎస్మూర్తి, శ్రీకాంత్లు అవార్డును అందుకున్నారు.
టాపికల్ న్యూస్ విభాగంలో 'ర్యాగింగ్ రక్కసి' పేరుతో ప్రసారమైన ఇదీ సంగతి కథనం అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును ఇదీ సంగతి బులిటెన్ ప్రొడ్యూసర్ వై.శ్రీనివాస్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఇదీ సంగతిలో ప్రసారం చేస్తున్న కథనాలు కదలించేలా ఉన్నాయని యూనిసెఫ్ 7వ అడిషన్ అధ్యక్షుడు ఉమాపతి అభినందించారు.
అలాగే సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశాలను వెలికితీయడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించాలని యూనిసెఫ్ జ్యూరీ 7వ ఎడిషన్ అధ్యక్షుడు ఉమాపతి కోరారు.