Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జుట్టు కత్తిరించుకున్న NTV 7 యాంకర్పై వేటు
అయితే ఈ పని చేసినందుకుగాను ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమెకు మతాధికారుల నుంచి వార్నింగ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు ఫత్వా జారీ చేశారు. అయితే రాస్ అదీబా మాత్రం ఏమాత్రం బెదరడం లేదు. తాను క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగానే జుట్టుకు కత్తిరించుకున్నానని, అంతకు మించి వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేస్తోంది.
క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రాణాలు పోవడం ఖాయమనే భావన చాలామందిలో ఉంది. అయితే వ్యాధిని ముందుగా గుర్తిస్తే దాని నుంచి బయటపడటం సాధ్యమేనని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతర్జాతీయంగా క్యాన్సర్ నిరోధంపై అవగాహనను కల్పించడానికి సుమారు 350 సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం ఖాయమనేదాన్ని చాలామంది అధిగమించారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ విషయానికి వస్తే ప్రముఖ గాయని మమతా మోహన్ దాస్ క్యాన్సర్ వ్యాధి బాధితురాలే. ముందస్తుగా వ్యాధిని కనుగొనడంతో దాని నుంచి ఆమె బయటపడింది.
అదేవిధంగా బాలీవుడ్ నటీమణి లీసారే, హాలీవుడ్ నటి బార్బరా తదితర నటీమణులు కూడా క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ వ్యాధి నుంచి బయటపడి యధావిధిగా తమతమ కెరీర్లలో రాణిస్తున్నారు.