Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
జుట్టు కత్తిరించుకున్న NTV 7 యాంకర్పై వేటు
అయితే ఈ పని చేసినందుకుగాను ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమెకు మతాధికారుల నుంచి వార్నింగ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు ఫత్వా జారీ చేశారు. అయితే రాస్ అదీబా మాత్రం ఏమాత్రం బెదరడం లేదు. తాను క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగానే జుట్టుకు కత్తిరించుకున్నానని, అంతకు మించి వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేస్తోంది.
క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రాణాలు పోవడం ఖాయమనే భావన చాలామందిలో ఉంది. అయితే వ్యాధిని ముందుగా గుర్తిస్తే దాని నుంచి బయటపడటం సాధ్యమేనని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతర్జాతీయంగా క్యాన్సర్ నిరోధంపై అవగాహనను కల్పించడానికి సుమారు 350 సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం ఖాయమనేదాన్ని చాలామంది అధిగమించారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ విషయానికి వస్తే ప్రముఖ గాయని మమతా మోహన్ దాస్ క్యాన్సర్ వ్యాధి బాధితురాలే. ముందస్తుగా వ్యాధిని కనుగొనడంతో దాని నుంచి ఆమె బయటపడింది.
అదేవిధంగా బాలీవుడ్ నటీమణి లీసారే, హాలీవుడ్ నటి బార్బరా తదితర నటీమణులు కూడా క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ వ్యాధి నుంచి బయటపడి యధావిధిగా తమతమ కెరీర్లలో రాణిస్తున్నారు.