Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుడిగాలి సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!
Recommended Video
జబర్దస్త్ షోతో రష్మీ పాపులర్ యాంకర్ గా మారిపోయింది. రష్మీకి గ్లామర్ కూడా కలసి రావడంతో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది. గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్ చేసి మెప్పించింది. రష్మీకి యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అదే విధంగా సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో కామెడి పంచ్ లు పేలుస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షోలనే సుధీర్, రష్మీ మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటుంటాయి. దీనితో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీ హాట్ టాపిక్ గా మారుతోంది.
అవాస్తవం అంటూ ఎన్నోసార్లు
సుధీర్, రష్మీ ప్రేమలో ఉన్నారు. వివాహానికి సిద్ధం అవుతున్నారు అంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో రష్మీ ఈ వార్తలని ఖండించింది. తనకు, సుధీర్ కి మధ్య ఉన్నది ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే అని తేల్చేసింది. తమ వృత్తిలో భాగంగా కొన్ని సార్లు అలా కనిపించాల్సి రావచ్చు. అది కేవలం అక్కడి వరకు మాత్రమే పరిమితం అని రష్మీ గతంలో తెలిపింది.
వైరల్ అవుతున్న ఫ్లెక్సీ
ఇదిలా
ఉండగా
సోషల్
మీడియాలో
సుధీర్,
రష్మీ
ఫోటోలు
ఉన్న
ఫ్లెక్సీ
ఒకటి
వైరల్
అవుతోంది.
తిరుపతిలో
ఈ
ప్లెక్సీని
ఏర్పాటు
చేశారు.
క్యాన్సర్
పై
అవకాగాహన
కల్పిస్తూ,
ప్రజల్ని
చైతన్య
పరచడానికి
కొందరు
తిరుపతిలో
10కె
రన్
నిర్వహించబోతున్నారు.
డిసెంబర్
9
న
జరిగే
ఈ
10
కె
రన్
కు
రష్మీ,
సుధీర్
బాబు
హాజరు
కాబోతున్నట్లు
ఓ
ప్లెక్సీని
ఏర్పాటు
చేశారు.
ఈ
ఫ్లెక్సీపై
రష్మీ
స్పందించింది.
|
ఫేక్ న్యూస్
రష్మీ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ఈ ఈవెంట్ నిర్వాహకులు ఎవరూ నన్ను ఇంత వరకు సంప్రదించలేదు. ఈ ఈవెంట్ కు నేను హాజరు కాబోతున్నట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని రష్మీ తెలిపింది. నా అనుమతి లేకుండా ఫోటోని ఉపయోగించుకున్నారు అంటూ మండిపడింది. ఈవెంట్ నిర్వాహకులు తన ప్లెక్సీని తొలగించాలని కోరింది.
నటిగా రాణిస్తూ
రష్మీ నటిగా రాణిస్తున్న గుంటూరు టాకీస్ తర్వాత అలాంటి విజయం దక్కడం లేదు. రష్మీ నటిస్తున్న చిత్రాలన్నీ నిరాశపరుస్తున్నాయి. జబర్దస్త్, ఢీ లాంటి షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఎలాంటి విషయం గురించి అయినా బోల్డ్ గా మాట్లాడేసే రష్మీ సినిమాల్లో కూడా బోల్డ్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది.